రైలు ప్రయాణికులకు శుభవార్త.. ఏపీలో వందేభారత్ రైలు ఆ స్టేషన్ వరకు పొడిగింపు!

ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం Vande Bharat trains ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. Vande Bharat trains  ఇప్పటికే దేశంలోని అనేక నగరాల మధ్య నడుస్తున్నాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

50కి పైగా Vande Bharat trains  ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి. ప్రయాణ సమయం తగ్గడంతో ఈ రైళ్లకు ప్రయాణికుల నుంచి మద్దతు లభించింది. తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్-విశాఖ మధ్య Vande Bharat  నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రైల్వే శాఖ శుభవార్త అందించింది. వందే భారత్ రైలును ఏపీలోని ఆ స్టేషన్ వరకు పొడిగించనున్నారు.

ఏపీలో Vande Bharat trains ను ఆ స్టేషన్ వరకు పొడిగించాలనే ప్రతిపాదనల నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం చెన్నై-విజయవాడ మధ్య నడుస్తున్న వందేభారత్‌ను భీమవరం వరకు పొడిగించనున్నారు. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ప్రతిపాదనలు చేయగా ఈ వందేభారత్ రైలు భీమవరం చేరుకుంటుంది. ఈ రైలు July నెలలో భీమవరం స్టేషన్‌కు చేరుకుంటుంది. ఈ Vande Bharat trains  (20677) ఉదయం 5.30 గంటలకు Chennai నుండి బయలుదేరుతుంది. మధ్యాహ్నం 12.10 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. ఈ రైలు (20678) 3.20కి Chennaiకి తిరిగి వస్తుంది.

అయితే విజయవాడ జంక్షన్‌లో రైళ్ల రద్దీ దృష్ట్యా ప్లాట్‌ఫారమ్ సమస్యగా మారడంతో దక్షిణ మధ్య రైల్వే వందేభారత్ రైలును భీమవరం వరకు పొడిగించేందుకు ప్రతిపాదనలు తీసుకొచ్చారు. దీనికి చెన్నై రైల్వే కూడా అనుమతి ఇవ్వడంతో భీమవరానికి వందే భారత్ రైలు రానుంది. విశాఖ-సికింద్రాబాద్ మధ్య నడుస్తున్న వందే భారత్ ఏలూరు జిల్లాలో ఎక్కడా ఆగడం లేదు. జిల్లా వాసులు ఈ రైలు ఎక్కాలంటే విజయవాడ, రాజమండ్రి వెళ్లాలి. అందుకే ఇప్పుడు చెన్నై-విజయవాడ మధ్య నడిచే ఈ రైలును భీమవరం వరకు పొడిగించేందుకు రైల్వే అధికారులు సిద్ధమయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *