HOLIDAYS: విద్యార్థులకు గుడ్ న్యూస్.. సెలవు ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు..

మహా శివరాత్రి తర్వాత రోజు తెలంగాణలోని మూడు ఉమ్మడి జిల్లాల్లోని విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ నెల 27న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనున్న నేపథ్యంలో, వరంగల్-ఖమ్మం-నల్లగొండ జిల్లాల్లోని విద్యా సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటిస్తూ ఆయా జిల్లాల జిల్లా కలెక్టర్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలకు 19 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. కరీంనగర్-మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్‌లో గ్రాడ్యుయేట్ స్థానానికి 56 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, ఉపాధ్యాయ స్థానానికి 15 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అయితే, పోటీ ప్రధాన పార్టీల మధ్య ఉంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

కరీంనగర్ గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో 3,41,313 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 2,18,060 మంది పురుషులు, 1,23,250 మంది మహిళలు, ముగ్గురు ఇతరులు ఉన్నారు. అదేవిధంగా కరీంనగర్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో మొత్తం 25,921 మంది ఓటర్లు ఉన్నారు. నల్గొండ ఉపాధ్యాయ నియోజకవర్గంలో 25,797 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో 14,940 మంది పురుషులు, 9965 మంది మహిళలు ఉన్నారు. ఈరోజు సాయంత్రం 4:30 గంటలకు ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగియడంతో ప్రధాన పార్టీల అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు.