₹250 పెట్టుబడితో ₹70 లక్షల భవిష్యత్… సుకన్యా సమృద్ధి యోజనతో మీ అమ్మాయి భవిష్యత్తు బంగారం..

నవరాత్రుల సమయంలో కేవలం అమ్మవారిని పూజించడమే కాదు, మన ఇంటి చిన్నారి అమ్మాయిల భవిష్యత్తును నిర్మించడానికీ ఇది గొప్ప సమయం. పోస్ట్ ఆఫీస్ ఈ సందర్భంగా సమృద్ధి సుకన్యా – సమృద్ధి సమాజం అనే కొత్త స్కీం ప్రచారాన్ని ప్రారంభించింది. దీని ద్వారా మీరు మీ కూతురి పేరు మీద కేవలం ₹250తో సుకన్యా సమృద్ధి ఖాతా ప్రారంభించవచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఈ స్కీమ్‌కి సంబంధించిన ముఖ్య లక్ష్యం – అమ్మాయిల చదువు, పెళ్లి వంటి ముఖ్యమైన ఖర్చుల కోసం ముందుగానే పొదుపు చేయడం. సుకన్యా సమృద్ధి యోజన కేవలం ఒక పొదుపు పథకం కాదు, అది మహిళా సాధికారత వైపు తీసుకెళ్లే మహత్తరమైన అడుగు. ఉత్తర గుజరాత్ పోస్ట్ మాస్టర్ జనరల్ కృష్ణ కుమార్ యాదవ్ ప్రకారం – ఇప్పటివరకు రాష్ట్రంలో 15.72 లక్షల మంది అమ్మాయిలకు ఈ పథకం ద్వారా ఖాతాలు తెరుచుకున్నారు.

ఈ పథకం ప్రకారం, 10 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల పేరు మీద ఈ ఖాతా ప్రారంభించవచ్చు. ఒక్క సంవత్సరం లో ₹250 నుండి ₹1.5 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. ఖాతా ఓపెన్ చేసిన తరువాత 15 సంవత్సరాల వరకూ డబ్బులు వేయాలి. అమ్మాయికి 18 ఏళ్ల వయసయ్యాక 50% డబ్బు తీసుకోవచ్చు. 21 సంవత్సరాలు పూర్తయినప్పుడు మొత్తం డబ్బు విత్‌డ్రా చేసుకోవచ్చు.

Related News

ఇప్పుడు ఈ పథకం 8.2% లాభదాయకమైన వడ్డీ అందిస్తోంది. అలాగే, ఏడాదికి ₹1.5 లక్షల వరకు పెట్టుబడిపై ఆదాయ పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. ఇది మనకు డబుల్ లాభం. ఒక్కసారి ఈ ఖాతా ఓపెన్ చేస్తే, అది అమ్మాయిల భవిష్యత్తుకు పెద్ద భద్రతను కల్పిస్తుంది.

నవరాత్రుల సమయంలో కన్యపూజ నిర్వహించడం ఓ సంప్రదాయం. అదే సమయంలో ఒక చిన్న బహుమతిగా మీ కూతురికి సుకన్యా సమృద్ధి ఖాతా ఓపెన్ చేయడం ఓ గొప్ప భవిష్యత్తు బహుమతిగా నిలుస్తుంది. ఇది కేవలం మతపరంగా కాదు, సమాజపరంగా, ఆర్థికంగా కూడ అమ్మాయిలకి ఒక భద్రతా వలయాన్ని ఏర్పాటు చేసే గొప్ప చర్య.

ఇంకెందుకు ఆలస్యం? కేవలం ₹250తో మీ కూతురి భవిష్యత్తుకు బలమైన మొదటి అడుగు వేయండి.