గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కు మరో షాక్ తగిలింది.

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కు మరో షాక్ తగిలింది. విజయవాడ ఎస్సీ, ఎస్టీ కోర్టు వల్లభనేని వంశీ రిమాండ్ ను మరోసారి పొడిగించింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీ రిమాండ్ ఈరోజుతో ముగిసిన నేపథ్యంలో.. జూమ్ యాప్ ద్వారా వల్లభనేని వంశీని న్యాయమూర్తి ప్రశ్నించారు.. ఆ తర్వాత విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు వంశీ రిమాండ్ ను ఈ నెల 25 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది..

ఇంతలో వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్ ను కొట్టివేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వంశీని మళ్ళీ విచారించడానికి కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ పిటిషన్ పై ఎస్సీ, ఎస్టీ కోర్టు విచారణ నిర్వహించింది. ఈ సందర్భంగా విజయవాడ ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక కోర్టు కస్టడీ పిటిషన్ ను కొట్టివేసింది. విచారణను ఈ నెల 12వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు కోర్టు ప్రకటించిన విషయం తెలిసిందే. మరోవైపు, ఈ కేసు విచారణలో భాగంగా కౌంటర్ దాఖలు చేయడానికి సత్యవర్ధన్ తరపు న్యాయవాది రెండు రోజుల సమయం కోరాడు. ఫలితంగా, బెయిల్ పిటిషన్ పై విచారణ 12వ తేదీకి వాయిదా పడింది. అదే సమయంలో, వల్లభనేని వంశీ తాను ఉంటున్న బ్యారక్‌లను మార్చాలని దాఖలు చేసిన పిటిషన్‌ను కూడా కోర్టు విచారించింది. అయితే, వంశీని ఇతర ఖైదీలు ఉన్న బ్యారక్‌లకు మార్చడం సాధ్యం కాదని జైలు అధికారులు కోర్టుకు తెలిపారు. భద్రతా కారణాల దృష్ట్యా బ్యారక్‌లను మార్చలేమని వారు చెప్పారు. వంశీ మృదువైన దిండు మరియు దుప్పటిని అడిగినప్పుడు, జైలు అధికారులు దానికి అంగీకరించారని తెలిసింది. .

Related News