ఆ టైంలో ఆర్డర్లు పెట్టొద్దు..కస్టమర్లకు Zomato కీలక సూచన

భానుడి ప్రతాపానికి దేశ వ్యాప్తంగా ప్రజలు అల్లాడుతున్నారు. ఈ నేపథ్యంలో, డెలివరీ ఏజెంట్ల శ్రేయస్సు కోసం Zomato తన కస్టమర్లకు కీలక సూచన చేసింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

మధ్యాహ్నం పూట అత్యవసరమైతే తప్ప ఆర్డర్లు ఇవ్వవద్దని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేసింది.

దీనిపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. చాలా మందికి ఈ అప్పీల్ కొంత వింతగా అనిపిస్తుంది. ఇంట్లో ఒంటరిగా ఉన్నవారు, వృద్ధుల పరిస్థితి ఏంటని కొందరు ప్రశ్నించారు.

మరికొందరు మనకు ఆకలిగా ఉన్నప్పుడే ఆర్డర్ చేసేది అని అడిగారు. మరికొందరు మధ్యాహ్నం ఆహార పంపిణీకి తాత్కాలిక విరామం ప్రకటించాలని సూచించారు.