Constable: కానిస్టేబుల్ అభ్యర్థులకు బిగ్ అలర్ట్!

ఆంధ్రప్రదేశ్ (ఏపీ) రాష్ట్రంలో 6,100 పోలీస్ కానిస్టేబుల్ (పీసీ) పోస్టుల భర్తీకి నవంబర్ 28, 2022న నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

గతేడాది ప్రిలిమ్స్‌, మెయిన్స్‌ పరీక్షలు నిర్వహించి తుది ఫలితాలను కూడా ప్రకటించారు. ఫిజికల్ టెస్టులకు మొత్తం 95,209 మంది ఎంపికయ్యారు. ఇదిలా ఉండగా.. అర్హత సాధించిన అభ్యర్థులకు పీఎంటీ, పీఈటీ ఈవెంట్లు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి.

ఈ దేహదారుఢ్య పరీక్షలు డిసెంబర్ 30 నుంచి ఫిబ్రవరి 1 వరకు 13 ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్నారు.

కాగా, ఈవెంట్‌లకు ఎంపికైన వారి హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకునే గడువు నేటితో ముగియనుంది.

అభ్యర్థులు ఏవైనా సందేహాలుంటే 9441450639, 9100203323 ఫోన్ నంబర్‌లకు కార్యాలయ పనివేళల్లో (ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు) లేదా అధికారిక వెబ్‌సైట్ https://slprb.ap.gov.in/ సందర్శించాలని అధికారులు తెలిపారు.