అమరావతి, ఆంధ్రప్రభః ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి బుధవారం ప్రభుత్వం జీవో 22 ను విడుదల చేసి ప్రక్రియను ప్రారంభించింది. తొలుత ప్రధానోపాధ్యాయులు తమ వివరాలు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఆ తర్వాత మిగిలిన వారికి బదిలీలు చేప ట్టనున్నారు. అయితే.. ఎస్జీటీలకు ఆఫ్లైన్లో బదిలీలు చేపడతామని పాఠశాల విద్య ఉన్నతాధి కారులు ఉపాధ్యాయ సంఘాల నేతల చర్చల సమ యంలో అంగీకారం తెలిపారు. దీంతో ఎసీటీలకు కొంత సౌలభ్యం లభించిందని అందరూ భావిం చారు. కానీ ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో మాత్రం అన్నివర్గాల ఉపాధ్యాయులకు ఎస్ఐటీలతో సహా ఆన్లైన్లో బదిలీలు చేపడతామని తెలియ జేయడంతో గందరగోళం నెలకొంది. చర్చల సంద ర్భంగా ఆఫ్లైన్ అని చెప్పి, జీవోలో ఆన్లైన్లో బది లీలు చేపడతామని చెప్పడం ఏంటని సంఘాల నాయ కులు ప్రశ్నిస్తున్నారు. జీవోలో సవరణలు చేయాలని లేదా జిల్లా అధికారులకు బదిలీల విషయమై ఆదేశాలు జారీ చేయాలని వారు కోరుతున్నారు.
ఆఫ్లైన్ జిల్లాల్లో సాధ్యం కాదు..
బదిలీల జీవోతో సంబంధం లేకుండా పాఠశాల ఉన్నతాధికారులు జిల్లా స్థాయి డీఈవోలకు ఆన్లైన్ బదిలీలు చేపట్టాలని సూచించినట్లు సమాచారం. అయితే.. తాము ఆన్లైన్ విధానం లో బదిలీలు చేపట్టలేమని ఉపా ధ్యాయ సంఘాలకు, టీచర్లకు డీఈ వోలు చెబుతున్నారు. తమ వద్ద ఆన్లైన్లో బదిలీలు చేపట్టే వనరు లు, సమయం లేవని పనిభారం ఉం టుందని జిల్లా అధికారులు చెబు తున్నారని సమా చారం. అయితే.. ఆన్లైన్ బదిలీల వల్ల తాము నష్టపో తామని ఎసీటీలు ఆందోళన
Related Posts
- ఉన్నతాధికారుల ఆన్లైను అంగీకారం
- అమలు చేయలేమంటున్న జిల్లా అధికారులు
- జిల్లాస్థాయిలో పనిభారం తగ్గించుకునేందుకు అధికారుల సాకులు
- జిల్లాకు 3,4 వేల మంది చొప్పున ఐచ్చికాలు నమోదు చేయనున్నఎస్జీటీలు
ఆన్లైన్లో పాఠశాలల వివరాలు, తప్పులు దొర్లుతాయనా టీచర్చ ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఉన్నతా ధికారులు మరోసారి జోక్యం చేసుకుని ఇచ్చిన మాట ప్రకారం ఆన్లైన్లో బదిలీలు చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక కోరుతోంది.
ఆన్లైన్లో చేపడితే ఇవే ఇబ్బందులు…
రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 50 వేల మంది ఎసిటీ లు ఈ ఏడాది బదిలీల లిస్టులో ఉన్నారు. వీరందరూ ఐచ్చికాలు ఎంపికచేసుకోవాల్సి ఉంటుంది. అయితే.. ఆన్లైన్ విధానంలో ఐచ్ఛికాలు ఎంపిక చేసుకోవడం కష్టతరంగా ఉంటుందని వీరు దెబుతున్నారు. ముఖ్యంగా మహిళలు ఆన్లైన్ విధానం అలవాటు లేకపోవడం, కంప్యూటర్ నాలెడ్జి లేకపోవడం వల్ల ఆప్షన్స్ ఎంపిక చేసుకునే క్రమంలో తప్పులు నమోదు చేస్తే దూరంగా పోస్టింగ్ వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దీంతోపాటు ఆన్లైన్ విధానంలో వందల సంఖ్యలో ఆప్షన్లు ఎంపిక చేసుకోవాల్సి వస్తుందని, ఈ విధానం వల్ల కనీసం ఆయా మండ లాల్లో పాఠశాలల స్థితిగతులు కూడా తెలియవని అంటు న్నారు. 2015 మధ్య కాలంలో ఆన్లైన్ విధా నంలో ఆప్షన్లు ఎంపిక చేసుకుని అక్కడ పొరపాట్లు చేయడం వల్ల అనేక మంది ఉపాధ్యాయులు నష్టపోయారని ఆ సమయంలో ధర్నాలు కూడా జరిగాయని ఉపా ధ్యాయ సంఘాలు చెబుతున్నాయి. ఇలాంటి సమస్యలు ఉన్న నేపథ్యంలో ఆన్లైన్లో బదిలీలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
వేకెన్సీల స్పష్టత కోసమే ఆఫ్లైన్..
జిల్లా విద్యాశాఖాధికారి కార్యలయంలో జరిగే ఆన్లైన్ బదిలీల ప్రక్రియ అందరికీ సౌకర్యవంతంగా ఉంటుందని ఎస్టీలు అభిప్రాయపడుతున్నారు. అక్కడే ఉపాధ్యాయుడికి వచ్చిన పాయింట్ల ఆధారం గా మండలాల్లోని పాఠశాలలు కనిపిస్తాయి. అక్కడి పాఠశాల వివరాలు తెలసుకుని ఐచ్చికాలు ఎంపిక చేసుకుంటే.. ఎక్కడికి బదిలీ అవుతుందనేది స్పష్టంగా తెలిసిపోతుంది.
దీంతోపాటు అప్పటికే పోస్టులు క్లోజ్ అయిన పాఠశాలల వివరాలు డిస్ప్లే కావడం వల్ల కొత్త పాఠశా లలను ఎంపిక చేసుకునే వీలుంటుంది. దీంతోపాటు ఐచ్చికాలు ఎంపిక సంఖ్య కూడా చాలా వరకు తగ్గిపోతుంది. తప్పులు చేసే అవకాశం ఉండదని ఎస్జీటీ టీచర్లు, సంఘాలు ముందు నుంచీ చెబుతున్నాయి.
-Andhrapabha daily news paper