విద్యాశాఖ అధికారులపై మంత్రి నారా లోకేష్ కు ఫిర్యాదులు..

కడప జిల్లా విద్యాశాఖ అధికారులపై ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి మంత్రి నారా లోకేష్‌కు ఫిర్యాదు చేశారు. కడప జిల్లాలో విద్యాశాఖ రీజనల్ జాయింట్ డైరెక్టర్, జిల్లా విద్యాశాఖాధికారి అవినీతి, అక్రమాలపై భూమిరెడ్డి లోకేష్‌ను కలిశారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

విచారణ జరిపి ఇద్దరిపై చర్యలు తీసుకోవాలని లోకేష్‌కు వినతి పత్రం అందించారు. భూమిరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. “రాఘవ రెడ్డి కడప జిల్లా రీజినల్ జాయింట్ డైరెక్టర్‌గా మార్చి నుంచి పనిచేస్తున్నారు. అంతకుముందు డీఈవోగా చాలాకాలం పనిచేశారు. రాఘవ రెడ్డి మార్చి 2023లో జరిగిన ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థులకు మద్దతుగా పనిచేశారు.

ఎమ్మెల్సీ అయిన తర్వాత తనపై ఫిర్యాదు చేస్తే ప్రెస్ మీట్ పెట్టి చంపేస్తానని బెదిరించాడు. కడప జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా స్పందించలేదు. రాష్ట్ర గవర్నర్‌కు ఫిర్యాదు చేశాను. గవర్నర్ విచారణకు ఆదేశించినా రాష్ట్ర విద్యాశాఖ అధికారులు పట్టించుకోలేదు. రాఘవ రెడ్డి అవినీతిపై ఉపాధ్యాయ సంఘాలు పలు సందర్భాల్లో ఫిర్యాదు చేసినా ఎవరూ స్పందించలేదు. ఇప్పటికైనా ఆయన్ను సస్పెండ్ చేయాలి, అక్రమాలపై విచారణ జరిపి కఠినంగా శిక్షించాలి’’ అని భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి నారా లోకేష్‌కు ఫిర్యాదు చేశారు.

Related News

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *