AP SSC results: పదో తరగతి ఫలితాలు వచ్చేసాయి.. క్షణాల్లో చూసుకోండి…

ఆంధ్రప్రదేశ్‌లో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాల కోసం విద్యార్థులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూశారు. ఈరోజు ఉదయం 10 గంటలకు ఫలితాలను ప్రభుత్వం అధికారికంగా విడుదల చేసింది. మంత్రి నారా లోకేష్ గారు ఫలితాలను ప్రకటించారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఎక్కడ చెక్ చేయాలి?

విద్యార్థులు ఫలితాలను BSEAP అధికారిక వెబ్‌సైట్‌లో కూడా చూడవచ్చు. మనమిత్ర వాట్సాప్‌, లీప్ యాప్‌ లాంటివాటిలో కూడా ఫలితాలు అందుబాటులో ఉన్నాయి. మనమిత్రలో ఫలితాలు చూడాలంటే 9552300009 అనే నంబర్‌కు ‘Hi’ అని మెసేజ్‌ చేయాలి. తరువాత హాల్‌టికెట్ నంబర్ ఇచ్చిన వెంటనే ఫలితాన్ని PDF రూపంలో పొందవచ్చు.

ఫలితాల్లో అమ్మాయిల మెరిసే ప్రదర్శన

ఈ సంవత్సరం మొత్తం 81.14 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇందులో అమ్మాయిలు మరింత మెరిసారు. అబ్బాయిల ఉత్తీర్ణత 78.31 శాతం కాగా, అమ్మాయిలు 84.09 శాతం మార్కులతో ముందున్నారు.

Related News

100 శాతం ఫలితాల స్కూళ్లు

ఈసారి రాష్ట్రవ్యాప్తంగా 1680 స్కూళ్లు 100 శాతం ఫలితాలను సాధించాయి. మరోవైపు 19 స్కూళ్లలో ఒక్కరు కూడా పాస్ కాలేదు. జిల్లాల వారీగా చూస్తే, పార్వతీపురం మన్యం జిల్లా అత్యధికంగా 93.90 శాతం ఉత్తీర్ణత నమోదు చేసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా మాత్రం కేవలం 47.64 శాతం ఫలితంతో అతి తక్కువ ఉత్తీర్ణత గల జిల్లాగా నిలిచింది.

ఎంత మంది పరీక్ష రాశారు?

2024-25 విద్యా సంవత్సరానికి గాను మొత్తం 6,19,275 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో 5,64,064 మంది ఇంగ్లిష్ మీడియం విద్యార్థులు కాగా, 51,069 మంది తెలుగు మీడియం విద్యార్థులు ఉన్నారు.

పరీక్షల వివరాలు

పదో తరగతి పరీక్షలు మార్చి 17 నుంచి ఏప్రిల్ 1 వరకు జరిగాయి. ఫలితాల కోసం జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 3 నుంచి 9వ తేదీ వరకు జరిగి, కేవలం ఏడు రోజుల్లో పూర్తి చేయడం జరిగింది. అదే వేగంతో బుధవారం ఫలితాలను విడుదల చేశారు.

తప్పకుండా చెక్ చేయండి

ఇప్పటికే ఫలితాలు విడుదలయ్యాయి. మీ ఫలితాలను వెంటనే చెక్ చేయండి. ఆలస్యం చేయకండి, మీ మార్కులపై భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.