ఏపీ ప్రజలకు చంద్రబాబు సర్కార్ శుభవార్త

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 8వ తేదీ నుంచి ఉచిత ఇసుక విధానం అమలు కానుంది. ఉచిత ఇసుకపై గనులశాఖ అధికారులు మార్గదర్శకాలు సిద్ధం చేశారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఈ మార్గదర్శకాలు సోమవారం (July  8) నుంచి అమలుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి ప్రభుత్వం కీలక మార్గదర్శకాలను రూపొందించింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఇప్పుడు ఇసుక నుంచి రూపాయి కూడా తీసుకోకూడదని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటి వరకు టన్ను ఇసుక రూ.475కు విక్రయించారు.

ఇందులో కాంట్రాక్టర్ తవ్వకం, రవాణా ఖర్చు రూ.100 అయితే మిగిలిన రూ.375 ప్రభుత్వానికి చేరేది. తాజా నిర్ణయం ప్రకారం.. రూ.375కి బదులు..

Related News

రూ.88 మాత్రమే వసూలు చేస్తారు. ఈ సొమ్మును స్థానిక సంస్థలకు కూడా జమ చేస్తారు. ఈ రూ.66 నేరుగా జిల్లా, మండల పరిషత్‌లు, పంచాయతీలకు చేరుతుంది. జిల్లా మినరల్ ఫండ్ కింద సేకరించిన రూ.19.80 కోట్లు రీచ్ ఏరియా అభివృద్ధికి జిల్లా ఖాతాకు వెళ్తాయి. గనుల శాఖలోని మినరల్ ఎక్స్‌ప్లోరేషన్ ట్రస్టుకు రూ.1.32 కోట్లు వస్తాయి. గత విధానంతో పోలిస్తే టన్ను ఇసుకపై రూ.287 భారం తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు.