
Chandigarh Dibrugarh Express Derails: చండీగఢ్-దిబ్రూగఢ్ ఎక్స్ప్రెస్ రైలు (15904) గురువారం ప్రమాదానికి గురైంది. ఉత్తరప్రదేశ్లోని గోండా సమీపంలో పట్టాలు తప్పింది.
గోండా, జిలాహి మధ్య పికౌరా ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం కారణంగా 12 బోగీలు పట్టాలు తప్పాయి. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంలో పలువురు ప్రయాణికులు గాయపడినట్లు ప్రాథమిక సమాచారం. సహాయక చర్యలను ముమ్మరం చేయాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశించారు. క్షతగాత్రులకు వెంటనే వైద్య సహాయం అందించాలని సూచించారు. ప్రమాదానికి గల కారణాలపై రైల్వే శాఖ విచారణకు ఆదేశించింది.
ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా, 17 మంది గాయపడినట్లు ప్రాథమిక సమాచారం. పట్టాలు తప్పిన బోగీల నుంచి ప్రయాణికులను స్థానికుల సాయంతో రక్షించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు.
[news_related_post]ఈ ప్రమాదంపై సామ్ ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కూడా స్పందించారు. పరిస్థితిని అధికారులు పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. ప్రయాణికుల సాయం కోసం రైల్వే శాఖ హెల్ లైన్ నంబర్లను ప్రకటించింది.