హైదరాబాద్: ప్రముఖ యూట్యూబర్ మరియు ప్రపంచ యాత్రికుడు అన్వేష్, యూట్యూబ్ ఛానల్ నిర్వాహకుడిపై సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.
హైదరాబాద్ మెట్రోలో బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించడం పేరుతో రూ. 300 కోట్లు మోసం చేశారని ఆరోపిస్తూ వీడియో ద్వారా తప్పుడు మరియు తప్పుదారి పట్టించే సమాచారాన్ని వ్యాప్తి చేసినందుకు తెలంగాణ డీజీపీ జితేందర్, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఐఏఎస్ అధికారులు శాంతికుమారి, దాన కిషోర్, వికాస్ రాజు మరియు ఇతరులపై పోలీసులు సుమోటోగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేయబడింది. వివరాలు ఇవే..! ‘ప్రజలలో గందరగోళం సృష్టించే ఉద్దేశ్యంతో ప్రభుత్వ అధికారులు మరియు చట్టబద్ధమైన సంస్థల ప్రతిష్టను దెబ్బతీసేలా ఈ వీడియో ఉంది..
Related News
ఈ వీడియో ప్రతిష్టను దెబ్బతీసేలా ఉంది. అధికారుల విశ్వసనీయతను దెబ్బతీసేలా ఈ వీడియో ఉంది.. ప్రభుత్వం పట్ల వ్యతిరేకత మరియు ద్వేషాన్ని సృష్టించేలా ఈ వీడియో ఉంది. “తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి ఈ వీడియోను రూపొందించిన కంటెంట్ సృష్టికర్త అన్వేష్పై చర్యలు తీసుకోవాలి” అని ఫిర్యాదులో పేర్కొంది.
సడన్ గా ఈ మధ్య బెట్టింగ్ అప్స్ మీద యుద్ధం ప్రకటించి దీనిలో ఉన్న ప్రతి ఒక్కరిని లాగి.. వారి మీద అభియోగాలతో అనేక వీడియో లు రిలీజ్ చేసాడు.. బిగ్ బాస్ షో ద్వారా నాగార్జున కూడా బెట్టింగ్ అప్స్ ప్రమోట్ చేసే ఒక సైన్యాన్ని తయారు చేసారు అనే అర్ధం లో కూడా రీసెంట్ గ ఒక వీడియో రిలీజ్ చేసాడు..
ఇంకా సినిమా ఇండస్ట్రీ లో ఉన్న అనేక మంది మీద కూడా ఈయన అనేక రకాల వీడియోస్ చేసి బెట్టింగ్ భూతాన్ని రూపుమాపాలని చెప్పుకుంటూ వచ్చాడు..
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు ప్రయాణించి, ఆ దేశాల ముఖ్యాంశాలను ప్రదర్శించే వీడియోలను రూపొందించడం ద్వారా అన్వేష్ అపారమైన ప్రజాదరణ పొందాడు.