కన్నప్ప సినిమాపై ఏపీ హైకోర్టులో వ్యాజ్యం

మోహన్ బాబు, విష్ణు, CBFC లకు నోటీసులు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

మంచు మోహన్ బాబు, విష్ణు నిర్మించి నటించిన కన్నప్ప చిత్రంలో బ్రాహ్మణ సమాజాన్ని కించపరిచే పేర్లు, సన్నివేశాలు ఉన్నాయని ఆరోపిస్తూ దాఖలైన కేసును మంగళవారం హైకోర్టు విచారించింది.

కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి, CBFC CEO, CBFC ప్రాంతీయ కార్యాలయ అధికారి, AP ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్, దర్శకుడు ముఖేష్ కుమార్ సింగ్, నటులు మంచు మోహన్ బాబు, విష్ణు, కన్నెగంటి బ్రహ్మానందం, పి. వెంకట ప్రభుప్రసాద్ సప్తగిరిలకు నోటీసులు జారీ అయ్యాయి. విచారణను ఆగస్టు 1కి వాయిదా వేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్. సుబ్బారెడ్డి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.

Related Posts

కన్నప్ప సినిమాలోని సన్నివేశాలు, పాత్రల పేర్లు బ్రాహ్మణ సమాజాన్ని కించపరిచేలా ఉన్నాయని ఆరోపిస్తూ బ్రాహ్మణ చైతన్య వేదిక అధ్యక్షుడు సిరిపురపు వెంకట శ్రీధర్ హైకోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ నెల 27న సినిమా విడుదల కానున్నందున ఈ ప్రక్రియను నిలిపివేయాలని పిటిషనర్ తరపు న్యాయవాది అభ్యర్థించారు. దీనిపై న్యాయమూర్తి స్పందిస్తూ సినిమాలో అభ్యంతరకరమైన విషయాలు ఉంటే వాటిని తొలగించాలని ఆదేశిస్తామని అన్నారు. ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు.