అదానీ గ్రూప్‌కు ట్రంప్ వరం? అమెరికాలో పెట్టుబడులు.. కేసులు మాయం?

గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ అమెరికాలో భారీ పెట్టుబడులు పెట్టాలని మళ్లీ ప్రణాళికలు వేసుకుంటోంది. అయితే, ఈ నిర్ణయం వెనుక అసలు కారణం పెట్టుబడులు కాదేమో

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల Foreign Corrupt Practices Act (FCPA) అమలును నిలిపివేశారు. ఇది అంతర్జాతీయ లంచపు కేసులను విచారించేందుకు ఉపయోగించే కీలక చట్టం. ఈ నిర్ణయం అదానీ గ్రూప్‌కు ఊరట కలిగించిందని చెబుతున్నారు.

కేసులున్నా… పెట్టుబడుల ప్రణాళిక ముందుకు?

Financial Times కథనం ప్రకారం, అదానీ గ్రూప్ అమెరికాలో అణుశక్తి, విద్యుత్ ప్రాజెక్టులు, ఈస్ట్ కోస్ట్ పోర్ట్ లాంటి రంగాల్లో పెట్టుబడులు పెట్టాలని మళ్లీ ఆలోచిస్తోంది. అయితే, అదానీ, ఆయన కంపెనీ టాప్ అధికారులపై అమెరికాలో భారీ లంచం కేసులు ఉన్నాయనే విషయం అందరికి తెలిసిందే.

Related News

అదానీపై లంచం ఆరోపణలు – కేసులు కొట్టివేయాలా?

  • అదానీ, ఆయన మేనల్లుడు సాగర్ అదానీ, ఇతర ఉన్నతాధికారులు – అమెరికా న్యాయ శాఖ (DoJ) వారికి భారీ లంచాల కేసులో నోటీసులు జారీ చేసింది.
  •  ఆరోపణల ప్రకారం, భారత ప్రభుత్వ అధికారులకు $250 మిలియన్ (సుమారు ₹2,000 కోట్లు) లంచం ఇచ్చి సోలార్ పవర్ కాంట్రాక్టులు దక్కించుకున్నట్లు DoJ అభియోగాలు మోపింది.
  •  అయితే అదానీ గ్రూప్ ఈ ఆరోపణలను పూర్తిగా ఖండిస్తోంది.

ట్రంప్ ‘భరోసా’తో మళ్లీ పెట్టుబడులు?

  •  2024లో ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత, అదానీ అమెరికాలో $10 బిలియన్ పెట్టుబడి పెట్టాలని వాగ్దానం చేశారు.
  •  దీనివల్ల 15,000 ఉద్యోగాలు వస్తాయని చెప్పారు. కానీ కొద్ది వారాల్లోనే ఆయనపై లంచం కేసులు నమోదయ్యాయి.
  •  ఇప్పుడు ట్రంప్ FCPA అమలును నిలిపివేయడంతో, ఈ కేసులు తగ్గిపోతాయన్న నమ్మకంతో అదానీ గ్రూప్ మళ్లీ పెట్టుబడి ప్రణాళికలు తీసుకురావాలని చూస్తోందట

అదానీపై గతంలోనూ ఆరోపణలు

  •  2023లో Hindenburg Research అదానీ గ్రూప్‌పై ఆఫ్‌షోర్ టాక్స్ హెవన్లు, షేర్ మార్కెట్ మోసాలు చేశారనే ఆరోపణలు చేసింది.
  •  ఈ వార్తల వల్ల అదానీ గ్రూప్ కంపెనీల మార్కెట్ విలువ ఏకంగా $150 బిలియన్ తగ్గిపోయింది.
  •  అప్పట్లో కూడా అదానీ ఈ ఆరోపణలను ఖండించారు.

ఇప్పుడు ఏమవుతుందో?

అదానీ గ్రూప్ పెట్టుబడులు పెడుతుందా లేక కేసుల పరిష్కారమే అసలు టార్గెట్టా? ట్రంప్ మద్దతుతో ఈ కేసులు నిజంగానే మాయమైపోతాయా? అమెరికా ప్రభుత్వం మరింత లోతుగా దర్యాప్తు చేస్తుందా?

పెట్టుబడుల పేరుతో కొత్త గేమ్ ఆడుతున్నారా? కేసుల ఒత్తిడిని పెట్టుబడులతో కవర్ చేయగలరా?” – ఇదే ఇప్పుడు పెద్ద ప్రశ్న.