చెక్కలంటే అందరికీ ఇష్టమే. కానీ ఎక్కువ మంది బియ్యప్పిండితోనే తయారు చేస్తారు. ఇప్పుడు చెప్పబోయే రెసిపీ మాత్రం చుట్టుపక్కలవాళ్లందరూ అడగాల్సిందే అనిపించేలా ఉంటుంది. అదేనండి… జొన్నపిండితో కరకరలాడే క్రిస్పీ చెక్కలు! ఆరోగ్యానికి మేలు చేస్తూ, నూనె కూడా తక్కువగా పీల్చుకుంటాయి. పైగా ఇది పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. రొట్టెలు తిననంటే అసలు ఫ్రస్టేషన్ అవసరం లేదు… ఈ చెక్కలు చేసి పెట్టండి, తినకుండా ఉండలేరు!
ముందుగా కొద్దిగా పెసరపప్పుని శుభ్రంగా కడిగి అరగంట పాటు నానబెట్టాలి. తర్వాత నీళ్లు వడకట్టి పక్కన పెట్టుకోవాలి. స్టవ్పై ఒక మందపాటి గిన్నెలో ఒకటిన్నర కప్పుల నీళ్లు తీసుకొని మరిగించాలి. నీళ్లు బాగా వేడవగానే స్టవ్ ఆఫ్ చేసి అందులో ఉప్పు, కారం, జీలకర్ర, నువ్వులు, అల్లం వెల్లుల్లి పేస్ట్, నానబెట్టిన పెసరపప్పు, తరిగిన కరివేపాకు, కొద్దిగా నూనె వేసి బాగా కలిపేయాలి.
ఈ మిశ్రమంలో జొన్నపిండిని కొద్ది కొద్దిగా కలుపుతూ ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి. పిండి బాగా కలిసిన తర్వాత పది నిమిషాల పాటు మూతపెట్టి పక్కన పెట్టాలి. తర్వాత పిండి చల్లారిన తరువాత చేతితో మళ్ళీ బాగా కలిపి ఉండలుగా చేసుకోవాలి.
ఇప్పుడు ఓ ఫ్లాట్ ప్లేట్ తీసుకొని బటర్ పేపర్ మీద కొద్దిగా నూనె రాసి చెక్కలు వత్తుకోవాలి. మీడియం మందంగా వత్తుకుని పక్కన పెట్టాలి. పూరీ ప్రెస్ ఉంటే మరింత సులభం. స్టవ్పైన నూనెను బాగా వేడిచేసిన తర్వాత చెక్కలను ఒకేసారి వేయాలి. రెండు వైపులా బంగారు రంగు వచ్చే వరకు కాల్చాలి. నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా ఉండాలంటే తప్పనిసరిగా నూనె బాగా వేడయ్యాకే వేయించాలి. ఒకసారి తరిగి పెట్టిన పిండితో అన్నీ ఇలా తయారు చేసుకోవాలి.
చెక్కలు పూర్తిగా చల్లారిన తర్వాత ఏదైనా హవేరు బాక్స్లో వేసుకుంటే 15–20 రోజుల వరకు ఫ్రెష్గా ఉండిపోతాయి. ఒక్కసారి ఈ జొన్న చెక్కలు ట్రై చేస్తే, బియ్యపిండి వదిలేసి మళ్లీ మళ్లీ ఇవే చేసుకుంటారు.
ఈ రెసిపీని ఓసారి ఇంట్లో ట్రై చేయండి. బయట మార్కెట్లోవి కిలోలు తీసుకుని పోసుకోవాల్సిన అవసరం ఉండదు. అంత రుచిగా, ఆరోగ్యంగా ఉంటాయి. ఇక మీదట చాయ్ టైమ్కి ఇవే బెస్ట్ కాంబినేషన్!