నిలోఫర్ హాస్పిటల్, సుషేనా హెల్త్ ఫౌండేషన్ సహకారంతో, క్విక్ వైటల్స్ ద్వారా దీనిని అందుబాటులోకి తెచ్చింది. ఫోటోప్లెథిస్మోగ్రఫీ ద్వారా మొబైల్ ఫోన్లో ఫేస్ స్కానింగ్ ద్వారా పరీక్షలు 20 నుండి 30 సెకన్లలో పూర్తవుతాయి. ఈ పరీక్షా పద్ధతిని మొదట నిలోఫర్లో అందుబాటులోకి తీసుకువస్తామని, నెక్ట్స్ మహారాష్ట్రలో ప్రవేశపెడతామని సంస్థ నిర్వాహకులు తెలిపారు. నిలోఫర్ హాస్పిటల్లో పిల్లలు మరియు గర్భిణీ స్త్రీలకు ఇటువంటి పరీక్షలు చాలా ఉపయోగకరంగా ఉంటాయని నిలోఫర్ వైద్యులు తెలిపారు.
అమృత్ స్వస్త్ భారత్లో ఇప్పుడు ఆరోగ్య పర్యవేక్షణ సెల్ఫీ తీసుకున్నంత సులభం అవుతుంది. మొబైల్ ఫేస్ స్కానింగ్ టెక్నాలజీ కీలకమైన ఆరోగ్య సమాచారాన్ని వేగంగా అందిస్తుంది. దీనితో, రక్తపోటు, హృదయ స్పందన రేటు, హిమోగ్లోబిన్ A1C మొదలైన వాటిని తెలుసుకోవచ్చు. ఈ పరీక్షలు 20-60 సెకన్లలో పూర్తవుతాయి. త్వరలో దేశవ్యాప్తంగా ఈ సేవలను అందుబాటులోకి తెస్తామని నిర్వాహకులు తెలిపారు.