AP MDM: సన్న బియ్యం వివరాలు – IMMS Appలో సబ్మిట్ చేసే ప్రక్రియ

మధ్యాహ్న భోజన పథకంలో లోపాలను సంకీర్ణ ప్రభుత్వం సరిదిద్దుతోంది. ప్రధానంగా ప్రజలు రేషన్ బియ్యం తినలేకపోతున్నారని, కొన్ని సందర్భాల్లో తిన్న బియ్యం జీర్ణం కాలేదని, అనారోగ్యానికి గురవుతున్నారని దృష్టిలో ఉంచుకుని బలవర్థకమైన సన్న బియ్యంతో భోజనం అందించాలని నిర్ణయించారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

మధ్యాహ్న భోజన పథకం సన్న బియ్యం జిల్లాకు చేరుకుంది.

మధ్యాహ్న భోజన పథకంలో లోపాలను సంకీర్ణ ప్రభుత్వం సరిదిద్దుతోంది. ప్రధానంగా ప్రజలు రేషన్ బియ్యం తినలేకపోతున్నారని, కొన్ని సందర్భాల్లో తిన్న బియ్యం జీర్ణం కాలేదని, వారు అనారోగ్యానికి గురవుతున్నారని దృష్టిలో ఉంచుకుని బలవర్థకమైన సన్న బియ్యంతో భోజనం అందించాలని నిర్ణయించారు. ఈ నెల 12 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతున్న నేపథ్యంలో, 11వ తేదీ నాటికి ఈ బియ్యాన్ని నేరుగా అన్ని పాఠశాలలకు అందించడానికి ఏర్పాట్లు చేశారు. బియ్యం ఇప్పటికే జిల్లాలోని పౌర సరఫరాల గోడౌన్లకు చేరుకుంది. పాఠశాలలకు వీటిని సరఫరా చేసే ప్రక్రియ కొనసాగుతోంది.

QR కోడ్‌లు మరియు ట్యాగ్‌లతో కూడిన 25 కిలోల ఫోర్టిఫైడ్ రైస్ సంచులను నేరుగా పాఠశాలలకు సరఫరా చేస్తారు. తద్వారా, ప్రధానోపాధ్యాయుల ఇబ్బందులు పరిష్కారమవుతాయి.

సన్న బియ్యం స్వీకరణ మరియు సమర్పణ వివరాలు – IMMS Appలో Step-by-Step Guide (తెలుగులో)

  • IMMS App ఓపెన్ చేయండి
  • User Name నమోదు చేయండి
  • Password నమోదు చేయండి
  • (PM Poshan) Mid Day Meals పై క్లిక్ చేయండి
  • HM Services పై క్లిక్ చేయండి
  • Rice Receipt పై క్లిక్ చేయండి
  • Get Transit Details పై క్లిక్ చేయండి
  • Transit Details downloaded successfully అనే సందేశం చూపబడుతుంది.
  • ఈ సమయంలో Year మరియు Month ఎంపిక చేసుకునే అవకాశం వస్తుంది.
  • Year మరియు Month ను ఎంచుకోండి.
  • తరువాత ఈ విధంగా వివరాలు కనిపిస్తాయి:
  • Truck chit No.: ABCDEF
  • Truck Number: APXX AB XXXX
  • Dispatch Date: XX/XX/XXXX
  • Commodity Name
  • Commodity Name పై క్లిక్ చేయండి (ఉదా: Jaggery / F Fine Rice)
  • మీరు ఎంచుకున్న Commodity వివరాలను అప్డేట్ చేయాలనుకుంటే Confirm చేయండి.
  • ఈ దశలో ఒక సందేశం కనిపిస్తుంది:
  • OTP will be sent to the selected Employee Aadhar tagged mobile number.
  • Choose One Role for OTP Authentication పై క్లిక్ చేయండి.
  • అందుబాటులో ఉన్న ఉపాధ్యాయుల జాబితాలోంచి ఒకరిని ఎంపిక చేసుకోండి.
  • Proceed పై క్లిక్ చేయండి.
  • QR కోడ్ ఉన్న బస్తాల సంఖ్యను నమోదు చేయండి.
  • QR కోడ్ లేని బస్తాల సంఖ్యను నమోదు చేయండి.
  • Next పై క్లిక్ చేయండి.
  • ఈ దశలో సందేశం వస్తుంది:
  • Click here to scan Rice bags QR code
  • (అన్ని బస్తాలపై ఉన్న QR కోడ్‌లను స్కాన్ చేయండి).
  • GET OTP పై క్లిక్ చేయండి.
  • ఎంపిక చేసిన ఉపాధ్యాయుడి మొబైల్ నంబరుకు వచ్చిన OTP నమోదు చేయండి.
  • Submit పై టాప్ చేయండి.

✅ Details Submitted Successfully

ఇంటర్మీడియట్ విద్యార్థులకు..

ఈ సంవత్సరం నుండి, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అమలు చేయబడుతుంది. జిల్లాలో 1802 ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి, వీటిలో 50 వేలకు పైగా విద్యార్థులకు ప్రతిరోజూ మధ్యాహ్న భోజనం అందించాల్సి ఉంది. జిల్లాలో 19 జూనియర్ కళాశాలలు ఉన్నాయి. వీటిలో కూడా ఈ సంవత్సరం నుండి మధ్యాహ్న భోజనం అమలు చేయబడుతోంది. వందలాది సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయి. వాటన్నింటికీ ఎంత బియ్యం అవసరమో పౌర సరఫరాల అధికారులు ఇప్పటికే గుర్తించారు. దానికి అనుగుణంగా బియ్యం నిల్వలను తరలించడానికి ఏర్పాట్లు చేశారు.