Tirumala package: ఇక నెలల తరబడి బుకింగ్స్.. రోజుల తరబడి వేటింగ్స్ లేనట్టే… ఒక్కరోజు చాలు…

హైదరాబాద్ నుంచి ‘ఒక రోజు’లో తిరుపతి టూర్.. ఉదయం 7 గంటలకు బయలుదేరితే రాత్రి 8 గంటలకు ఇంటికి తిరిగి.. వివరాలు: తిరుమల శ్రీవారి భక్తులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. హైదరాబాద్ నుంచి తిరుమల వెళ్లి స్వామివారిని దర్శించుకుని ఒకే రోజు తిరిగి వచ్చేలా ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ఉదయం 7 గంటలకు బయలుదేరి దర్శనం తర్వాత రాత్రి 8 గంటలకు తిరిగి వచ్చేలా రూపొందించారు. ఈ ప్యాకేజీ ధర రూ. 12,499, రెండు రోజుల ప్యాకేజీ కూడా అందుబాటులో ఉంది. మరిన్ని వివరాల కోసం తెలంగాణ టూరిజం వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

తిరుమల శ్రీవారి భక్తులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త అందించింది. తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శించుకుని ఒకే రోజులో తిరిగి వచ్చేలా ప్రత్యేక ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. సాధారణంగా తిరుమల శ్రీవారిని దర్శించుకుని తిరిగి రావడానికి కనీసం రెండు రోజులు పడుతుంది. విమానంలో వెళితే తిరుమల త్వరగా చేరుకోవచ్చు. కానీ భక్తులను దర్శించుకోవడానికి పట్టే సమయం అక్కడి భక్తుల రద్దీపై ఆధారపడి ఉంటుంది.

ప్రస్తుతం వేసవి సెలవుల నేపథ్యంలో తిరుమలకు భక్తులు పెద్ద సంఖ్యలో వెళ్తున్నారు. క్యూ కాంప్లెక్స్‌లు అన్నీ భక్తులతో నిండిపోయాయి. దర్శనానికి 20 గంటలు పడుతుందంటే భక్తుల రద్దీ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ విషయంలో, శ్రీవారి దర్శనం చేసుకోవాలనుకునే భక్తులకు తెలంగాణ ప్రభుత్వం ఇటీవల శుభవార్త అందించింది. తిరుమలకు వెళ్లి ఒకే రోజు దర్శనం చేసుకునేందుకు వీలు కల్పించే టూర్ ప్యాకేజీని తీసుకువచ్చింది. వివరాలు…

తెలంగాణలోని శ్రీవారి భక్తులకు రాష్ట్ర పర్యాటక శాఖ శుభవార్త అందించింది. తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకుని తిరిగి వచ్చేందుకు టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది. ఇందులో భాగంగా ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరితే, తిరుమలకు వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకుని రాత్రి 8 గంటలలోపు ఇంటికి తిరిగి రావచ్చు.

అయితే, ఈ టూర్ ప్యాకేజీ ధరలు కొంచెం ఎక్కువగా ఉన్నాయి. ఒక్కొక్కరికి రూ.12,499 చెల్లించాలి. దీనితో పాటు, తెలంగాణ పర్యాటక శాఖ రెండు రోజుల టూర్ ప్యాకేజీలను కూడా అందుబాటులోకి తెచ్చింది. దీని ధర రూ. 15,499గా నిర్ణయించబడింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం, మీరు www.tourism.telangana.gob.in వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు

ఈ పర్యటనలో భాగంగా మీరు హైదరాబాద్ నుండి తిరుమలకు వెళ్లాలనుకుంటే, ఉదయం 6.55 గంటలకు విమానం ఎక్కి, ఉదయం 8 గంటలకు రేణిగుంటలో దిగుతారు. అక్కడి నుండి, మిమ్మల్ని కారులో తిరుపతి హోటల్‌కు తీసుకెళతారు. అక్కడికి వెళ్లి ఫ్రెష్ అయిన తర్వాత, మిమ్మల్ని కారులో తిరుమలకు తీసుకెళతారు. మధ్యాహ్నం 1 గంటలకు, మీరు తిరుమల శ్రీవారి దర్శనం పూర్తి చేసుకుని తిరుపతికి తిరిగి వస్తారు. మీరు హోటల్‌కు వచ్చి గంటసేపు విశ్రాంతి తీసుకోవచ్చు.
ఆ తర్వాత, మీరు తిరుచానూరులోని పద్మావతి అమ్మవారిని సందర్శించవచ్చు. ఆ తర్వాత, మిమ్మల్ని విమానాశ్రయానికి తీసుకెళతారు. ఈ విమానం సాయంత్రం 6.35 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుండి బయలుదేరుతుంది విమానం రాత్రి 7.45 గంటలకు హైదరాబాద్‌లో ల్యాండ్ అవుతుంది తిరుపతి వన్ డే ఫ్లైట్ టూర్ ప్యాకేజీ ధర ఇప్పుడు ఒక్కొక్కరికి రూ. 12,499గా నిర్ణయించబడింది.

ఈ ప్యాకేజీలో విమాన టికెట్, కారు ప్రయాణ ఛార్జీలు మరియు రెండు చోట్ల ప్రత్యేక దర్శనాలు ఉన్నాయి.