Pawan Kalyan: పవన్ కొడుక్కి ప్రమాదం.. R K రోజా స్పందన చూసారా ?

పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లోని వ్యాలీ షాప్‌హౌస్‌లోని ఒక పాఠశాలలో చదువుతున్నాడు. ఈ ఉదయం పాఠశాలలో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో పాఠశాలలో 80 మంది పిల్లలు ఉన్నారు. అగ్నిమాపక సిబ్బంది అరగంట పాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో ఒక చిన్నారి మరణించాడు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

దాదాపు 15 మంది పిల్లలు, నలుగురు పాఠశాల సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ కూడా ఉన్నాడు. శంకర్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయని, పొగ కారణంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్లు సమాచారం.

శంకర్ చదువుతున్న పాఠశాలలో జరిగిన అగ్నిప్రమాదం కారణంగా శంకర్ ఊపిరితిత్తులలోకి పొగ చేరిందని చిరంజీవి తెలిపారు. వెంటనే శంకర్‌ను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. శంకర్ ఇప్పుడు బాగానే ఉన్నాడు. శంకర్ ఆరోగ్యం బాగానే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చిరంజీవి అన్నారు. మరోవైపు, మాజీ ఏపీ సీఎం వైఎస్‌ఆర్‌సిపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆ చిన్నారి త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో కోరారు. పవన్ కళ్యాణ్ కొడుకు ఇటీవల జరిగిన ప్రమాదం తనను తీవ్రంగా బాధపెట్టిందని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు.

Related News

మార్క్ శంకర్ కు జరిగిన ప్రమాదం గురించి విన్న తర్వాత తాను చాలా బాధపడ్డానని రోజా ట్వీట్ చేశారు.. ఆ బిడ్డ త్వరగా కోలుకుని తన కుటుంబంతో దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించాలని నేను దేవుడిని హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాను.

అయితే, ప్రస్తుతం అరకులో పర్యటనలో ఉన్న పవన్ కళ్యాణ్ తన పర్యటనను ఇక్కడ ముగించుకుని సింగపూర్ వెళ్తారు. ఈ విషయం తెలుసుకున్న తర్వాత, పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు సింగపూర్‌లో ఎందుకు ఉంటున్నాడని మీరు ఆలోచిస్తున్నారా? పవన్ భార్య అన్నలేజ్ నెవా సింగపూర్‌లో చదువుతోంది. ఆమె సింగపూర్ నేషనల్ యూనివర్సిటీ నుండి డిగ్రీ పొందారు . చదువు కోసం వెళ్ళిన తన తల్లితో పాటు, అతని కొడుకు కూడా అక్కడే చదువుతున్నాడు.