ఏడు రూపాయల రేషన్‌ వల్ల భారీ జైలుశిక్ష?.. ప్రభుత్వం హెచ్చరిక…

హరియాణాలో BPL (బిలో పోవర్టీ లైన్) కార్డు కలిగి ఉన్న కుటుంబాలకు ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. మోసం చేస్తూ ప్రభుత్వ పథకాలు పొందుతున్నవారిని గుర్తించి, వారిపై చర్యలు తీసుకోవడం ప్రారంభించింది. ఇప్పటికే 1,609 కుటుంబాల పేర్లు BPL జాబితా నుంచి తొలగించబడ్డాయి. ఇంకా ఎవరి పేర్లు తప్పుగా జాబితాలో ఉన్నాయో వారు స్వయంగా తమ పేరు తీసివేయాలని ప్రభుత్వ సూచన. లేకపోతే ఏప్రిల్ 20 తర్వాత పోలీసు కేసులు (FIR) నమోదు చేయబడతాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ప్రస్తుతం హరియాణాలో సుమారు 51 లక్షల BPL కార్డు కలిగిన కుటుంబాలు ఉన్నాయి. అందులో చాలా మందికి వార్షిక ఆదాయం రూ.1,80,000 పైగా ఉన్నా కూడా కార్డు వాడుతూ ఉండటాన్ని ప్రభుత్వం గమనించింది. అందుకే ఇప్పుడు ప్రజలందరికీ మెసేజ్‌లు పంపుతూ, పరివార్ పహచాన్ పత్ర (PPP) డేటాలో తమ ఆదాయాన్ని అప్‌డేట్ చేయమని చెబుతోంది.

మీ ఆదాయం నిజంగా రూ.1.80 లక్షల కన్నా ఎక్కువ అయితే వెంటనే ‘Mera Parivar’ పోర్టల్‌‌కి వెళ్లి మీ ఆదాయ వివరాలు సరి చేయాలి. ఈ సమాచారాన్ని ఆధారంగా తీసుకుని కొత్త BPL జాబితా తయారవుతుంది. ఇప్పటి వరకు ప్రభుత్వం రేషన్ కార్డులు అప్పగించమని అనలేదు. కానీ మీ ఆదాయం ఎక్కువగా ఉంటే, వెంటనే అప్‌డేట్ చేయకపోతే న్యాయపరమైన చర్యలు తప్పవు.

Related News

మీ పేరు BPL జాబితాలో నుండి తీసేయాలనుకుంటే, మీరు దగ్గరలో ఉన్న ఫుడ్ & సప్లై డిపార్ట్‌మెంట్ కార్యాలయంకి వెళ్లి దరఖాస్తు చేయవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి లింక్ ఇప్పటివరకు యాక్టివ్ కాలేదు.

ఇప్పుడే అప్డేట్ చేయండి. పేదలకోసం ఉండే పథకాల్లో లాభాలు పొందడం, తర్వాత జైలు పాలవడం మితిమీరిన పని. ప్రభుత్వం ఏప్రిల్ 20 తర్వాత కఠినంగా వ్యవహరించనుంది. అందుకే ఎవరు నిజమైన అర్హులో వారే కార్డు వాడాలి. లేకపోతే ఇప్పుడు వచ్చే చిన్న మెసేజ్… రేపు పోలీసుల నోటీసుగా మారవచ్చు.