ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమవుతోంది. దీని ద్వారా భారతీయ పన్ను చెల్లింపుదారులకు కొన్ని భారీ మార్పులు ఎదురుకాబోతున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2025 లో కొన్ని కీలకమైన పన్ను మార్పులను ప్రకటించారు. ముఖ్యంగా, సంవత్సరానికి ₹12 లక్షల వరకు ఆదాయం ఉన్నవాళ్లు ఇకపై ఆదాయపు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇది మధ్య తరగతి ప్రజలకు ఓ బిగ్ రిలీఫ్ అనే చెప్పొచ్చు.
పాత & కొత్త పన్ను విధానాల్లో తేడా ఏమిటి?
- పాత పన్ను విధానం కింద ₹7 లక్షల వరకు మాత్రమే ఆదాయం పన్ను మినహాయింపు ఉండేది.
- కొత్త పన్ను విధానం కింద ₹12 లక్షల వరకు సంపాదించినా ట్యాక్స్ చెల్లించాల్సిన పనిలేదు..
- ఉద్యోగస్తులకు అదనంగా ₹75,000 స్టాండర్డ్ డిడక్షన్ కూడా అందుబాటులో ఉంది.
- ₹25 లక్షల వరకు ఆదాయం ఉన్నవాళ్లు ఏడాదికి ₹1.1 లక్షల వరకు ట్యాక్స్ పొదుపు చేసుకునే అవకాశం ఉంది.
ఇంతకుముందు ట్యాక్స్ సేవింగ్స్ కోసం పెట్టుబడులు పెట్టేవాళ్లం… ఇక ఆ పనిలేదు..
మునుపటి పాత పన్ను విధానం కింద
- LIC, PPF, సుకన్య సమృద్ధి యోజన, ELSS, ఇతర చిన్న సేవింగ్ స్కీమ్స్లో పెట్టుబడి పెడితేనే ట్యాక్స్ మినహాయింపు ఉండేది.
- 80C కింద ₹1.5 లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపు అందుబాటులో ఉండేది.
- అందుకే, చాలా మంది LIC పాలసీలు, PPF, FD లలో డబ్బులు పెట్టేవారు – ఎందుకంటే, ట్యాక్స్ తగ్గించుకోవడం అనేది ప్రధాన కారణం.
అయితే ఇప్పుడు పరిస్థితి మారిపోయింది..
- మీ ఆదాయం ₹12 లక్షల లోపైతే, ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరమే లేదు..
- పాత ట్యాక్స్ సేవింగ్ స్కీమ్స్లో పెట్టుబడి పెట్టే అవసరమూ లేదు..
- మీ దృష్టిని మిగతా అధిక రాబడి ఇన్వెస్ట్మెంట్స్పై కేంద్రీకరించుకోవచ్చు.
కొత్త ట్యాక్స్ విధానం ఎంతమందికి లాభం?
- ఇప్పటివరకు 75% మంది పన్ను చెల్లింపుదారులు కొత్త ట్యాక్స్ విధానాన్ని ఎంపిక చేసుకున్నారు.
- ఇకపై 90% మంది కొత్త పన్ను విధానానికి మారతారు అని CBDT చైర్మన్ రవి అగర్వాల్ ప్రకటించారు.
- మీ ఆదాయం ₹12 లక్షల లోపైతే ఇకపై ట్యాక్స్ గురించి అసలు ఆలోచనే అవసరం లేదు.
ఇప్పుడే ఆలోచించాల్సిన 3 ముఖ్యమైన విషయాలు…
- LIC, PPF, FD లలో డబ్బులు పెట్టే ముందు కొత్త ట్యాక్స్ విధానం మీకు లాభదాయకమా? అని సరిచూడండి.
- మీరు సెక్షన్ 80C కింద సేవింగ్స్ చేసుకోవడం కంటే, అధిక రాబడులు వచ్చే పెట్టుబడులపై దృష్టి పెట్టడం మంచిది.
- మీ ఆదాయం ₹12 లక్షలకు లోపైతే, ఇకపై ట్యాక్స్ కోసం ఫిక్స్డ్ డిపాజిట్, LIC, లేదా PPF బలవంతంగా పెట్టాల్సిన అవసరం లేదు..
ఇప్పుడే డెసిషన్ తీసుకోండి – లేటయితే లాస్ అవుతారు..
- మీ ఆదాయం ₹12 లక్షల లోపైతే, ఇకపై ట్యాక్స్ మినహాయింపు కోసం LIC, PPF, లేదా FD లలో పెట్టుబడి పెట్టాల్సిన పనిలేదు..
- ఇప్పుడు మీరు ఆ డబ్బును స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, రియల్ ఎస్టేట్ వంటి హై-రిటర్న్ ఇన్వెస్ట్మెంట్స్లో పెట్టి ఎక్కువ లాభాలు పొందొచ్చు..
- కొత్త ట్యాక్స్ విధానం మీకు ఏ విధంగా లాభపడుతుందో అర్థం చేసుకొని, మీ ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ మార్చుకోవాలి..
ఇప్పటివరకు LIC, PPFలో డబ్బులు పెట్టారా? ఇక అవసరం లేదు మీ ట్యాక్స్ లిమిట్ ఏకంగా ₹12 లక్షల దాకా పెరిగింది.