ప్రధానమంత్రి సూర్య ఘర్ యోజన కింద కేంద్ర ప్రభుత్వం ప్రజలకు ఉచిత కరెంట్ అందించేందుకు భారీగా నిధులు కేటాయించింది. ఇప్పటివరకు 10 లక్షలకుపైగా ఇండ్లపై సోలార్ ప్యానెల్స్ అమర్చబడ్డాయి. మీరు ఇంకా ఈ స్కీం గురించి తెలుసుకోలేదా? తక్కువ పెట్టుబడితో ఉచిత కరెంట్ + భారీ సబ్సిడీ పొందొచ్చు.
ఈ స్కీమ్లో మీకు లభించే ప్రయోజనాలు:
- 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ (మీ ఇంట్లో నెలసరి బిల్లు 300 యూనిట్లలోపే అయితే కరెంట్కి ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన పనిలేదు!)
- ₹30,000 ప్రోత్సాహకం 1KWకి (మొత్తం ₹48,000 వరకు సబ్సిడీ పొందొచ్చు)
- సబ్సిడీ డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్లోకి
- తక్కువ పెట్టుబడితో లాంగ్టర్మ్ ఆదాయం
స్కీమ్కు సంబంధించిన ముఖ్యమైన వివరాలు:
- ప్రారంభం: 13 ఫిబ్రవరి 2024
- మొత్తం బడ్జెట్: ₹75,000 కోట్ల పెట్టుబడి
- లక్ష్యం: 2027 నాటికి 1 కోట్ల ఇండ్లపై సోలార్
- ఇప్పటివరకు దరఖాస్తులు: 47.3 లక్షలు
- ఇప్పటివరకు సబ్సిడీ పొందిన వారి సంఖ్య: 6.13 లక్షల మంది
- ఇప్పటి వరకు విడుదల చేసిన సబ్సిడీ మొత్తం: ₹4,770 కోట్లు
ఎంత సబ్సిడీ లభిస్తుంది?
▪ 2 కిలోవాట్ల (KW) వరకు – ₹30,000/KW
▪ 3 కిలోవాట్ల వరకు – ₹48,000/KW
ఇది మీ ఇంటికి ఎందుకు అవసరం?
- వచ్చే 25-30 ఏళ్ల పాటు ఉచిత కరెంట్
- సెల్ఫ్ సఫీషియెంట్ ఎలక్ట్రిసిటీ – కరెంట్ కోతల సమస్యే ఉండదు
- మీ ఇంటికి విలువ పెరుగుతుంది
- ప్రకృతికి మేలు – గ్రీన్ ఎనర్జీకి సహకారం
ఇప్పుడే దరఖాస్తు చేసుకోండి… ఆలస్యమైతే అవకాశం మిస్ అవ్వొచ్చు.