RBI కొత్తగా ₹50, ₹100, ₹200 నోట్లను విడుదల చేయనున్నట్టు ప్రకటించింది. కొత్తగా నియమితులైన గవర్నర్ సంజయ్ మల్హోత్రా సంతకం ఉన్న ఈ నోట్లు త్వరలో మార్కెట్లోకి రానున్నాయి.
కొత్త నోట్ల గురించి ముఖ్యమైన విషయాలు:
₹100, ₹200 నోట్లలో మార్పులు:
- ప్రస్తుతం ఉన్న మహాత్మా గాంధీ (New) సిరీస్ డిజైన్ను కొనసాగిస్తూ, కొత్త నోట్లు విడుదల చేయనున్నారు.
- పాత ₹100, ₹200 నోట్లు చెల్లుతూనే ఉంటాయి, వాటిని బ్యాన్ చేయడం లేదు.
₹50 నోట్లలో మార్పులు:
- కొత్త ₹50 నోట్లను కూడా విడుదల చేయనున్నారు.
- మహాత్మా గాంధీ చిత్రంతో పాటు, అధునాతన భద్రతా ఫీచర్లు ఉంటాయి.
కొత్త గవర్నర్ సంతకం:
Related News
- సంజయ్ మల్హోత్రా డిసెంబర్ 2024లో RBI గవర్నర్గా బాధ్యతలు స్వీకరించారు.
- ఈ కొత్త నోట్లపై ఆయన సంతకం ఉంటుంది.
కౌంటర్ఫీట్ కరెన్సీకి చెక్:
- దేశంలో పెరుగుతున్న నకిలీ నోట్ల సమస్యను ఎదుర్కొనడానికి కొత్త భద్రతా ఫీచర్లు ఈ నోట్లలో అమలు చేయనున్నారు.
నోట్ల మార్పు తో ప్రభావం?
- మీ దగ్గర ఉన్న పాత ₹50, ₹100, ₹200 నోట్లు చెల్లుతూనే ఉంటాయి.
- చాలా మంది తమదగ్గర ఉన్న పాత నోట్లు చెల్లవు అనుకుంటూ ఉంటారు కానీ అలాంటి పరిస్థితా ఏం రాదు. ఎందుకంటే పాత నోట్లు రద్దు అని గానీ లేదా చెళ్ళవు అని గానీ ఎవ్వరూ ప్రకటించలేదు. కాబట్టి ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు.
- బ్యాంకుల్లో లేదా ఎటీఎంలలో కొత్త నోట్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.
మరి మీరు కొత్త నోట్లు చూడటానికి రెడీనా?