TGSRTC: ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త చెప్పిన తెలంగాణ ప్రభుత్వం.!!

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం తీపి వార్త చెప్పింది. ఈ మేరకు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ 2.5 శాతం డీఏ ప్రకటించారు. తాజా నిర్ణయంతో రేవంత్ ప్రభుత్వంపై ప్రతి నెలా రూ.3.6 కోట్ల అదనపు భారం పడనుంది. మంత్రి పొన్నం ఆలోచన మేరకు తెలంగాణ ప్రభుత్వం మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మహిళా సాధికారత దిశగా ముందుకు సాగుతోంది. కోటి మంది మహిళలను లక్షాధికారులను చేయడమే అంతిమ లక్ష్యంతో శనివారం నుంచి ఇందిరా మహిళా శక్తి బస్సును ప్రారంభించనున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

మొదటి దశలో మండల మహిళా సమైక్య సంఘాల నుంచి 150 బస్సులను అద్దె ప్రాతిపదికన ఆర్టీసీకి ఇవ్వనున్నారు. రెండో దశలో మహిళా సమైక్య సంఘాలు మరో 450 బస్సులను అద్దె ప్రాతిపదికన అద్దెకు తీసుకుంటాయి. మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం సీఎం రేవంత్ రెడ్డి మహిళా శక్తి బస్సులను ఘనంగా ప్రారంభించనున్నారు.