నరసరావుపేట టూ టౌన్ పీఎస్‌లో 153, 504, 67 సెక్షన్ల కింద పోసానిపై కేసు..

సినీ నటుడు, వైఎస్ఆర్సీపీ నాయకుడు పోసాని కృష్ణ మురళిని నరసరావుపేట పోలీసులు పీటీ వారెంట్ పై అదుపులోకి తీసుకున్నారు. పోసానిని త్వరలో నరసరావుపేటకు తీసుకెళ్తారు. సాయంత్రం 4 గంటలకు పోసానిని నరసరావుపేటకు తీసుకువచ్చే అవకాశం ఉంది. నరసరావుపేట పోలీసులకు అప్పగించే ముందు, జైలు అధికారులు పోసానికి వైద్య పరీక్షలు నిర్వహించారు. నరసరావుపేట టూ టౌన్ పీఎస్ లో 153, 504, 67 సెక్షన్ల కింద పోసానిపై కేసు నమోదు చేశారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

గతంలో రాజంపేట సబ్ జైలు వద్ద ఉద్రిక్తత నెలకొంది. గత నాలుగు రోజులుగా రాజంపేట సబ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న పోసాని కృష్ణ మురళిని పీటీ వారెంట్ పై అదుపులోకి తీసుకోవడానికి 3 జిల్లాల పోలీసు అధికారులు వచ్చారు. నరసరావుపేట, అల్లూరి జిల్లా, అనంతపురం గ్రామీణ పోలీసులు రాజంపేట జైలు అధికారికి పీటీ వారెంట్లు జారీ చేశారు. నరసరావుపేట పోలీసులు రాజంపేట జైలు అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, తాము కోర్టు అనుమతి తీసుకున్నామని, ముందుగా పోసానిని తమకు అప్పగించాలని చెప్పారు. ఎవరికి అప్పగించాలో జైలు అధికారులు ఉన్నతాధికారులతో మాట్లాడారు. దీనికి సంబంధించిన నిబంధనలను కూడా పరిశీలించారు. ఉన్నతాధికారుల అనుమతితో పోసానిని నరసరావుపేట పోలీసులకు అప్పగించారు.