National : ఆదాయ పన్ను మినహాయింపు 5లక్షలకు పెంపు!

ఆదాయపు పన్ను లెక్కింపులో కొత్త పన్నుల విధానంలో ఉన్న వారికి.. కొనసాగుతున్న కసరత్తు

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

వచ్చే నెలలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టనున్న 2024-25 బడ్జెట్‌లో వేతన జీవులకు ఊరట లభించే అవకాశం లేదా?

పాత పన్ను విధానంలో ఉన్న వాటిని పక్కనబెట్టి కొత్త పన్ను విధానంలో ఉన్నవారికి ప్రభుత్వం రాయితీలు ఇస్తుందా? అంటే అవుననే అంటున్నాయి సంబంధిత వర్గాలు.

Related News

ఐటీ మినహాయింపు పరిమితిని ప్రభుత్వం రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచే అవకాశం ఉందని సంబంధిత అధికారులు తెలిపారు. అయితే, ఈ పెంపు కొత్త పన్ను విధానంలో ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుందని పేర్కొంది. మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తిని పెంచేందుకు, జీడీపీ వృద్ధికి తోడ్పాటు అందించేందుకు, కొత్త ఆదాయపు పన్ను విధానం వైపు ప్రజలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఈ ఆలోచన చేస్తోందని వివరించారు.

బడ్జెట్‌ ప్రవేశపెట్టడానికి కొద్ది రోజుల ముందు ప్రభుత్వం ఈ అంశంపై తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. కాగా, కొత్త పన్ను విధానంలో రూ.15 లక్షల కంటే ఎక్కువ వార్షికాదాయం ఉన్న వారి నుంచి గరిష్టంగా 30% ఆదాయపు పన్ను వసూలు చేస్తున్నారు. బడ్జెట్ రూపకల్పనలో దానిని 25 శాతానికి తగ్గించాలన్న విజ్ఞప్తులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదని మరో అధికారి వెల్లడించారు. అలాగే పాత విధానంలో ప్రస్తుతం రూ.10 లక్షల కంటే ఎక్కువ వార్షికాదాయం ఉన్న వారి నుంచి రూ.30 ఆదాయపు పన్ను వసూలు చేస్తున్నారు. ఈ పరిమితిని రూ.20 లక్షలకు పెంచాలని వినతులు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *