AP లో ఆ ఉద్యోగులకు 23 % జీతాల పెంపు – ఉత్తర్వులు జారీ..!

రాష్ట్ర ఎన్నికల వేళ వైసీపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో వైఎస్ జగన్ పాదయాత్రలో ఇచ్చిన హామీ మేరకు కీలక శాఖలోని ఉద్యోగులకు వేతనాలు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

ఇప్పటికే ఉద్యోగుల్లో నెలకొన్న అసంతృప్తిని తొలగించేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వం పలు శాఖల్లో వేతనాలు, గౌరవ వేతనాలు పెంచుతోంది. ఇదే క్రమంలో విద్యాశాఖలోని కీలక శాఖలో గతంలో ఇచ్చిన హామీ మేరకు గౌరవ వేతనాన్ని భారీగా పెంచారు.

రాష్ట్రంలోని విద్యాశాఖలో సమగ్ర శిక్షాస్మృతిలో పనిచేస్తున్న ఉద్యోగులకు తాను అధికారంలోకి రాగానే గౌరవ వేతనం పెంచుతామని గతంలో వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. కానీ నాలుగేళ్లుగా అమలు కావడం లేదు. దీంతో గౌరవ వేతనం పెంచాలని సమగ్ర శిక్షా ఉద్యోగులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. దీంతో 2019లో జీతం పెరగని ఉద్యోగులందరికీ తాజాగా సమగ్ర శిక్షాస్మృతి కింద పనిచేస్తూ గౌరవ వేతనాన్ని ప్రభుత్వం పెంచింది.

Related News

రాష్ట్రంలో సమగ్ర శిక్షాస్మృతిలో పనిచేస్తున్న, 2019 జనవరి 1 నుంచి గౌరవ వేతనం పెంచని వారందరికీ 2024 జనవరి 1 నుంచి వేతనాలు పెంచుతూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.దీంతో వారి వేతనాలు ఆ మేరకు పెరిగాయి. సమగ్ర శిక్షా ప్రాజెక్టు డైరెక్టర్ నుంచి అందిన సమాచారం మేరకు వేతనాలు పెంచుతున్నట్లు విద్యాశాఖ ఉత్తర్వుల్లో పేర్కొంది. తాజా ఉత్తర్వుల మేరకు తదుపరి చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాశ్ ప్రాజెక్టు డైరెక్టర్ను ఆదేశించారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *