46 వేల ఎకరాలకు పత్రాలు ఇచ్చేందుకు సిద్ధమైన వైఎస్ జగన్…

ఏపీలో భూమిలేని నిరుపేదలకు భూమిని అందించి, భూములపై సర్వహక్కులు కల్పిస్తూ.. పేద రైతుల చిరకాల భూసమస్యలకు చివరి పాట పాడేందుకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం సిద్ధమైంది. ఏలూరు జిల్లా నూజివీడులో రేపు జరగనున్న కార్యక్రమంలో సీఎం జగన్ 46 వేల ఎకరాల అసైన్డ్, ఎల్పీఎస్ భూములకు సంబంధించిన పత్రాలను లబ్ధిదారులకు పంపిణీ చేయనున్నారు. ఇందులో అసైన్డ్‌తో పాటు ఎల్‌పీఎస్‌ భూములు కూడా ఉన్నాయి. దళితులతో పాటు ఇతర వెనుకబడిన తరగతుల లబ్ధిదారులకు వీటిని అందజేస్తారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే 20,24,709 మంది పేదలకు 35,44,866 ఎకరాల భూమిని పంపిణీ చేసి భూమిపై సర్వహక్కులు కల్పించింది. అలాగే కొత్తగా అసైన్డ్ భూమిలేని దళిత, బడుగు, బలహీన వర్గాలు, పేదలు, గ్రామ సర్వీస్ ఇనాం, ఎస్సీ కార్పొరేషన్ (ఎల్పీఎస్) భూములకు అన్ని హక్కులు కల్పించేందుకు భూ యాజమాన్య హక్కు పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించనున్నారు.

ఏలూరు జిల్లా నూజివీడులో జరిగే కార్యక్రమంలో సీఎం వైఎస్‌ జగన్‌ దళితులు, ఇతర పేదలకు భూపంపిణీ పత్రాలను అందించనున్నారు. ఇందులో భాగంగా 42,307 మంది పేదలకు 46,463 ఎకరాల అసైన్డ్ భూమిని పంపిణీ చేయనున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 9,064 ఎకరాల లంక భూమిలో 17,768 మందికి అసైన్డ్/లీజు పట్టాలు ఇవ్వనున్నారు. 20 ఏళ్ల అసైన్‌మెంట్‌ పూర్తి చేసుకున్న 15,21,160 మంది రైతులకు 27,41,698 ఎకరాల అసైన్‌డ్‌ భూములపై పూర్తి హక్కులు కల్పించనున్నారు.

1,563 గ్రామ సచివాలయాల పరిధిలో దళితుల శ్మశాన వాటికల కోసం ప్రభుత్వం 951 ఎకరాల భూమిని కేటాయిస్తోంది. భూ కొనుగోలు పథకం (ఎల్పీఎస్) కింద ఎస్సీ కార్పొరేషన్ ద్వారా పంపిణీ చేసిన 22,837 ఎకరాల భూమిపై 22,346 మందికి పూర్తి హక్కులు కల్పించి వారి రుణాలను మాఫీ చేయనున్నారు. భూసమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలనే ఉద్దేశంతో దేశంలోనే తొలిసారిగా ప్రభుత్వం వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూమి హక్కు, భూమి రక్షణ పథకాన్ని చేపట్టింది.

వంద సంవత్సరాల తర్వాత చేపట్టిన ఈ భూముల రీసర్వే ద్వారా ఇప్పటి వరకు 17,595 రెవెన్యూ గ్రామాలకు గాను రెండు విడతలుగా 4000 గ్రామాల్లో 42.6 లక్షల ఎకరాల రీసర్వే పూర్తయింది. అలాగే 17.53 లక్షల మంది రైతులకు భూమి హక్కు పత్రాలు పంపిణీ చేశారు. 4.8 లక్షల మ్యుటేషన్లు, 10.21 లక్షల కొత్త భూ ఉపవిభాగాలు ఏర్పాటు చేశారు. 45 వేల సరిహద్దు వివాదాలను పరిష్కరించారు. రీసర్వే పూర్తయిన 4వేల గ్రామాల్లో గ్రామ సచివాలయంలోనే రిజిస్ట్రేషన్‌ చేయించుకునే అవకాశం కల్పించారు. శుక్రవారం రెండో దశలో 2 వేల గ్రామాలకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం కానున్నాయి.

20 సంవత్సరాల పైబడిన అసైన్డ్ (DKT) భూముల తొలగింపు, గ్రామ సేవా ఇనాం భూములు, SC కార్పొరేషన్ (LPS) ద్వారా పంపిణీ చేయబడిన భూములు సెక్షన్ 22-A నుండి మరియు ఈ భూములను కొనుగోలు చేయడానికి, విక్రయించడానికి, రుణం తీసుకోవడానికి, తనఖా, బహుమతిగా, బహుమతిగా, వారసత్వంగా పొందేందుకు అన్ని హక్కులు ఉన్నాయి. ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *