ఫైనాన్స్ మంత్రి నిర్మలా సీతారామన్ 2025 కేంద్ర బడ్జెట్లో TDS (Tax Deducted at Source) నిబంధనల్లో భారీ మార్పులు చేశారు. ముఖ్యంగా పేద మధ్య తరగతి ప్రజలు, సీనియర్ సిటిజన్లు, పెట్టుబడిదారులు, కమీషన్ ఆధారంగా ఆదాయం పొందేవారు ఈ మార్పుల వల్ల పెద్దగా ప్రయోజనం పొందనున్నారు. ఏప్రిల్ 1, 2025 నుండి అమలులోకి రాబోయే ఈ కొత్త నిబంధనల గురించి పూర్తిగా తెలుసుకోండి.
1. సీనియర్ సిటిజన్లు, FD/RD పెట్టుబడిదారులకు ఊరట
- ఇంతకు ముందు సాధారణ పౌరులకు FD, RD లపై TDS మినహాయింపు ₹40,000 మాత్రమే ఉండేది.
- ఇప్పుడు దీన్ని ₹50,000కి పెంచారు, అంటే బ్యాంకు డిపాజిట్లపై లాభంగా వచ్చే వడ్డీ ఆదాయం ₹50,000 లోపు ఉంటే TDS కత్తిరించరు.
- సీనియర్ సిటిజన్లకు అయితే ₹1,00,000 లోపు ఇంట్రెస్ట్ వచ్చినా TDS మినహాయింపుగా పరిగణిస్తారు.
2. FD, RD వడ్డీపై TDS ఎలా ఉంటుందంటే?
- ₹50,000 లోపు FD, RD వడ్డీ ఆదాయానికి TDS ఉండదు (సాధారణ పౌరులకు).
- సీనియర్ సిటిజన్లు అయితే ₹1,00,000 వరకు వడ్డీపై TDS మినహాయింపు పొందవచ్చు.
- ఇది మధ్య తరగతి, పెన్షనర్లకు భారీ ఊరట అని చెప్పాలి.
3. బీమా ఏజెంట్లకు కూడా ఊరట
- ఇంతకు ముందు బీమా కమీషన్లపై TDS మినహాయింపు ₹15,000 మాత్రమే ఉండేది.
- 2025 నుంచి దీన్ని ₹20,000కి పెంచారు, అంటే బీమా ఏజెంట్లు, బ్రోకర్లు ఎక్కువ ప్రయోజనం పొందనున్నారు.
4. కొత్త రూల్స్ వల్ల మీకు ఏ లాభం?
- FD, RD పెట్టుబడిదారులకు TDS మినహాయింపు పెంపు
- సీనియర్ సిటిజన్లకు ₹1,00,000 లోపు వడ్డీపై TDS ఉండదు
- బీమా ఏజెంట్లకు ₹20,000 వరకు కమీషన్ పై TDS మినహాయింపు
- టాక్స్ భారం తగ్గి, ఎక్కువ ఆదాయం పొందే అవకాశం
5. కొత్త TDS రూల్స్ ఎప్పటి నుండి అమలులోకి రానున్నాయి?
ఈ TDS సడలింపులు 2025 ఏప్రిల్ 1 నుండి అమలులోకి రానున్నాయి. అంటే మీరు ఇప్పటి నుంచే మీ పెట్టుబడులను, ఆదాయ వనరులను ప్లాన్ చేసుకోవచ్చు.
ఇంకెందుకు ఆలస్యం? మీ పెట్టుబడులపై కొత్త TDS మినహాయింపులు ఎలా ప్రయోజనం కలిగిస్తాయో ఇప్పుడే అంచనా వేసుకోండి…