ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు.. ఒక ఎంపీ కూడా టీడీపీలోకి జంప్ చేస్తారా..?

ఏపీలో ఎన్నికలు ముగిశాయి. సంకీర్ణ ప్రభుత్వం అపూర్వ విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేశారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

త్వరలో అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభం కానున్నాయి. కాగా, నిన్నటి వరకు తిరుగులేని మెజారిటీతో అధికారంలో ఉన్న YCP ఈసారి కేవలం 11 స్థానాలకే పరిమితమైంది. ఆ పార్టీకి 11 సీట్లు వస్తే అది మామూలు అవమానం కాదు. ఇక YCPకి నాలుగు లోక్సభ సీట్లు వచ్చాయి.

అరకుతో పాటు తిరుపతి, రాజంపేట, కడప ఎంపీ స్థానాలను YCP కైవసం చేసుకుంది. అయితే ఇప్పుడు YCP నుంచి గెలిచిన ఎమ్మెల్యేలతో పాటు ఓ ఎంపీ పార్టీ కూడా పసుపు కండువా కప్పుకునేందుకు రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.

Related News

దీంతో పార్టీ పూర్తిగా గందరగోళంలో పడింది. ఐదేళ్లుగా బలం లేకుండా ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండి..అది కూడా బలమైన ప్రతిపక్షం కాదు..అసలు ప్రతిపక్ష హోదా ఇస్తారో లేదో కూడా తెలియని పార్టీలో ఉండడం కంటే..అధికార పక్షంలో చేరితే. పంచేన, కనీసం కొంత మేర అయినా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి ఐదేళ్లు అధికార పార్టీ ఎమ్మెల్యేగా, లేకుంటే ఐదేళ్లు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయవచ్చు. కొందరు ఎమ్మెల్యేలు గోళ్లు కోసుకుని టైమ్ పాస్ చేయడం తప్ప చేసేదేమీ లేదన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

పార్టీ మారేందుకు ముగ్గురు YCP ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ ఉన్నారని పేర్లు వినిపిస్తున్నాయి. కర్నూలు జిల్లాలో ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి, అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం, పాడేరు ఎమ్మెల్యే మత్సరస విశ్వేశ్వర రాజు, విశాఖ ఏజెన్సీలో అరకు ఎంపీ చెట్టి తనూజారాణి జంపింగ్ లిస్టులో ఉన్నారు. వీరంతా ఐదేళ్లుగా YCPలో ఉండి.. ప్రాధాన్యత లేకుండా ఎంపీ, ఎమ్మెల్యేలు కావాల్సిన అవసరం లేదని.. పార్టీ మారే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.

Note: ఈ సమాచారం సోషల్ మీడియా నుంచి తీసుకోబడింది..

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *