జీవో 117కు ప్రత్యామ్నాయ జీవో.. » నేడు విడుదల చేసే అవకాశం! .. » తొమ్మిది రకాలుగా పాఠశాలలు .. » అందుకనుగుణంగా టీచర్ల బదిలీలు
* త్వరలోనే బదిలీలకు షెడ్యూలు
అమరావతి, మే 6 ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠ శాలలపై వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 117 వివాదాస్పదంగా మారడంతో, ప్రత్యామ్నాయంగా కూటమి ప్రభుత్వం కొత్త జీవోను శనివారం విడు దల చేయనున్నట్లు తెలిసింది. ఈ ఫైలు ప్రస్తుతం సీఎం కార్యాలయంలో ఉంది. అక్కడ గ్రీన్సిగ్నల్ వచ్చిన వెంటనే జీవో విడుదల చేస్తారు.
Related News
అందులో పేర్కొనే పాఠశాలల పునర్వ్యవస్థీకరణకు అనుగు ణంగా ఉపాధ్యాయుల బదిలీలు చేస్తారు. త్వర లోనే బదిలీల షెడ్యూలు కూడా విడుదల కానుంది. గత ప్రభుత్వం జీవో 117తో ఆరు రకాల పాఠశాలలను అమల్లోకి తీసుకొచ్చింది. కొత్త వి ధానం తీసుకొస్తామన్న కూటమి ప్రభుత్వం తొలుత ఐదు రకాల పాఠశాలల విధానాన్ని ప్రతి పాదించి, ఇప్పుడు దానిని తొమ్మిది రకాలుగా మార్చింది.
క్షేత్రస్థాయిలో ఏ పాఠశాలకు ఎంత మంది టీచర్లు అవసరమవుతారనేది అంచనా వేశారు. దీని ఆధారంగా బదిలీలు చేస్తారు.