మీ కూతురి భవిష్యత్తు కోసం సూపర్ స్కీమ్.. నెలకు 5 వేల పెట్టుబడితో 28 లక్షలు

బాలికలు, మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం సూపర్‌ పథకాలను ప్రవేశపెడుతోంది. వారికి ఆర్థిక భద్రత కల్పించేందుకు మంచి చిన్న పొదుపు పథకాలను తీసుకొచ్చింది. ముఖ్యంగా ఆడపిల్లల కోసం అద్భుతమైన పథకాన్ని అమలు చేస్తోంది. ఆడ పిల్లల తల్లిదండ్రులపై భారం పడకూడదనే ఉద్దేశంతో కేంద్రం Sukanya Samriddhiyojana scheme ప్రవేశపెట్టింది. ఆడపిల్లల చదువులు, పెళ్లి ఖర్చులకు ఎలాంటి ఇబ్బందులు లేకపోయినా ఈ పథకంలో పెట్టుబడి పెడితే సరిపోతుంది. ఈ పథకంలో మీరు రూ. 5 వేలు పెట్టుబడి పెడితే, మెచ్యూరిటీ నాటికి చేతికి 28 లక్షల వరకు పొందవచ్చు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

Sukanya Samriddhiyojana scheme కింద ఒక కుటుంబంలో ఇద్దరు ఆడపిల్లల పేరుతో ఖాతాలు తెరవవచ్చు. రెండో బిడ్డలో కవల ఆడపిల్లలు పుడితే మూడో ఖాతా కూడా తెరవవచ్చు. ఈ పథకంలో చేరడానికి వారి వయస్సు 10 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి. కనీసం రూ. 250 జమ చేయాల్సి ఉంటుంది. వార్షిక గరిష్టంగా రూ. 1.5 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. ఈ విధంగా, మీరు 15 సంవత్సరాల పాటు నిరంతరం పెట్టుబడి పెట్టాలి. అమ్మాయికి 21 ఏళ్లు నిండిన తర్వాత ఆ మొత్తాన్ని పొందవచ్చు. సుకన్య సమృద్ధి యోజన పథకంలో ఖాతా తెరవడానికి, మీరు సమీపంలోని బ్యాంకు లేదా పోస్టాఫీసుకు వెళ్లి పూర్తి సమాచారాన్ని పొంది ఖాతాను తెరవవచ్చు.

 నెలకు రూ. 5,000 పెట్టుబడితో చేతికి రూ. 28 లక్షలు:
బాలికల తల్లిదండ్రులు తమ కుమార్తె పేరిట ఖాతా తెరిచి రూ. 5,000 డిపాజిట్ చేయవచ్చు. ఇలా ఇన్వెస్ట్ చేస్తే మెచ్యూరిటీపై రూ. 28 లక్షలు పొందవచ్చు. పెట్టుబడికి నెలకు రూ. 5,000, ఏడాదిలో మొత్తం రూ. 60,000 డిపాజిట్ చేయబడుతుంది. ఈ విధంగా, మీరు 15 సంవత్సరాలలో మొత్తం రూ.9,00,000 పెట్టుబడి పెడతారు. ఈ పెట్టుబడిపై 8.2 శాతం వడ్డీని అందిస్తారు. సుకన్య సమృద్ధి యోజన కాలిక్యులేటర్ ప్రకారం మెచ్యూరిటీ సమయంలో 8.2 శాతం వడ్డీకి రూ. 28.73 లక్షలు చేతికి వస్తాయి.

Related News

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *