వాహనదారులు ఒక సంవత్సరంలో 200 ట్రిప్పులు పూర్తి చేస్తే, వారు తమ ఫాస్ట్ ట్యాగ్ పాస్ను వెంటనే పునరుద్ధరించుకోవాలి. అలాగే, ఒక సంవత్సరంలో 200 ట్రిప్పులు పూర్తి చేయకపోతే, ఒక సంవత్సరం పూర్తయిన తర్వాత వారు మళ్ళీ పాస్ను పునరుద్ధరించాల్సి ఉంటుంది. ఈ మేరకు, కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ X ద్వారా వివరాలను వెల్లడించారు. ఈ విధానం ఈ సంవత్సరం ఆగస్టు 15 నుండి అమల్లోకి వస్తుంది. దేశంలోని జాతీయ రహదారులపై ఎటువంటి పరిమితులు లేకుండా ప్రయాణించడానికి ఫాస్ట్ ట్యాగ్ ఆధారిత వార్షిక పాస్ను ప్రవేశపెడుతున్నట్లు గడ్కరీ తెలిపారు. ఈ పాస్ రాకతో, టోల్ గేట్ల వద్ద క్యూలు తగ్గుతాయని, దీని కారణంగా కార్లు, జీపులు మరియు వ్యాన్ల యజమానులు తమ గమ్యస్థానాలకు వేగంగా చేరుకోగలరని గడ్కరీ అన్నారు. మొత్తం భారతీయ టోల్ గేట్ వ్యవస్థ డిజిటలైజ్ చేయబడుతుందని, ఇది అవినీతిని తగ్గిస్తుందని కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
Fastag: ఫాస్టాగ్ షాకింగ్ రూల్స్… 200 ట్రిప్పులకే పాస్ రీన్యూవల్…

25
Jun