JAYASUDHA: రీమేక్ సినిమాలు ఇప్పుడు సర్వసాధారణం అయ్యాయి. ఎందుకంటే చాలా మంది దర్శకులు మరియు నిర్మాతలు కొత్త కథలు ఆడతాయో లేదో చూడటానికి రీమేక్లపై ఆధారపడుతున్నారు.
తెలుగు లో రవిరాజా పినిశెట్టి రీమేక్ సినిమాలు బాగా తీస్తాడు. అతను అప్పట్లో ‘చంటి’ సినిమా తీశాడు. ఇది తమిళంలో సూపర్ హిట్ అయిన ‘చిన్నతంబి’కి రీమేక్. ఆ తర్వాత, మోహన్ బాబుతో ‘యం. ధర్మరాజు ఎంఏ’ సినిమా తీశాడు. అది కూడా సూపర్ హిట్ .
అయితే, మోహన్ బాబు వరుస పరాజయాలను ఎదుర్కొంటున్నప్పుడు, రజనీకాంత్ అతన్ని చెన్నైకి పిలిపించి తమిళ హిట్ చిత్రం ‘నట్టమై’ రీమేక్ హక్కులను తీసుకోమని చెప్పాడు.. . మోహన్ బాబు ఆ హక్కులను తీసుకొని రవిరాజా పినిశెట్టికి దర్శకత్వం చేయమని అప్పగించాడు. పెదరాయుడు పాత్రకు రజనీకాంత్ను అనుకున్నారు.. . ఈ చిత్రంలో మోహన్ బాబు ద్విపాత్రాభినయం చేశారు. పెదరాయుడు భార్య పాత్రలో భానుప్రియ, చినరాయుడు భార్య పాత్రలో సౌందర్య నటించారు.
అయితే, సినిమా ప్రారంభం మొదట్లో , జయసుధను పెదరాయుడు భార్య పాత్రలో నటించమని అడిగారు అట . అప్పుడు ఏమి జరిగిందో జయసుధ మాటల్లోనే వినండి…
‘పెదరాయుడు చిత్రంలో పెదరాయుడు భార్యగా నటించమని నన్ను అడిగారు. కథ బాగుంది, నాకు అది నచ్చింది కూడా.. . కానీ మోహన్ బాబుతో పాట, డాన్స్ ఉంటుందని చెప్పారు. ఆ వయసులో నేను పాటలు, డాన్సులు చేయలేను అనిపించింది . అందుకే ఆ అవకాశాన్ని వదులుకున్నాను. నా స్థానంలో భానుప్రియను తీసుకున్నారు’ అని జయసుధ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.
1995లో విడుదలైన ‘పెదరాయుడు’ చిత్రం ఆ సంవత్సరం ఇండస్ట్రీ బ్రేకింగ్ హిట్. ఈ చిత్రం తో ఫ్లాపులతో సతమతమైన మోహన్ బాబుకు మంచి బ్రేక్ వచ్చింది .