POSANI MURALI: నటుడు పోసాని విడుదలకు బ్రేక్.. కారణం ఇదేనా?

ప్రముఖ సినీ నటుడు పోసాని కృష్ణ మురళి విడుదలకు బ్రేక్ పడినట్లే కనిపిస్తోంది. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, వారి కుటుంబ సభ్యులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో అరెస్టయిన పోసానికి కర్నూలు కోర్టు నిన్న (మంగళవారం) బెయిల్ మంజూరు చేసింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

కోర్టు రూ. 20,000 పూచీకత్తు, ఇద్దరు పూచీకత్తులపై బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో గుంటూరు సీఐడీ పోలీసులు కర్నూలు జిల్లా జైలుకు వెళ్లి ఆయనకు పీటీ వారెంట్ జారీ చేశారు. దీంతో ఆయనను వర్చువల్‌గా న్యాయమూర్తి ముందు హాజరుపరుస్తారు. అంతకుముందు రోజు నరసరావుపేట జిల్లా కోర్టు కూడా బెయిల్ మంజూరు చేసింది. కాబట్టి ఈరోజు (బుధవారం) ఆయన జైలు నుంచి విడుదల అవుతారని వార్తలు వచ్చాయి. కానీ, ఇటీవల సీఐడీ పీటీ వారెంట్ దాఖలు చేయడంతో ఆయన విడుదల అకస్మాత్తుగా ఆగిపోయింది.