IPL 2025: గుడ్‌ న్యూస్‌.. ఐపీఎల్‌ షెడ్యూల్‌ ఖారారు! తొలి మ్యాచ్‌ ఎప్పుడంటే?

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 18వ సీజన్ షెడ్యూల్‌ను పాలకమండలి ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఐపీఎల్-2025 సీజన్ మార్చి 22న కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ప్రారంభం కానుందని సమాచారం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

డిఫెండింగ్ ఛాంపియన్ కోల్‌కతా నైట్ రైడర్స్ తొలి మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుందని పలు నివేదికలు చెబుతున్నాయి.

క్రిక్‌బజ్ కథనం ప్రకారం.. రన్నరప్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మార్చి 23న ఉప్పల్ స్టేడియంలో తమ తొలి మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనుంది. ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ ఆదివారం చెన్నైలో జరుగుతుంది. ఛాంపియన్స్ ట్రోఫీ ముగిసిన 12 రోజుల తర్వాత ఐపీఎల్ ప్రారంభమవుతుంది.

Related News

మే 25న ఫైనల్‌కు కోల్‌కతా వేదికగా ఉంటుంది… క్వాలిఫయర్ 1 మరియు ఎలిమినేటర్ మ్యాచ్‌లు హైదరాబాద్‌లో జరుగుతాయి. పది జట్లు పాల్గొనే ఈ టోర్నమెంట్‌లో, లీగ్ మొత్తం 12 వేదికలలో జరుగుతుంది, ఇందులో పది జట్ల హోమ్ గ్రౌండ్‌లు మరియు రెండు ఇతర వేదికలు (ధర్మశాల మరియు గౌహతి) ఉన్నాయి.

రాజస్థాన్ రాయల్స్ జట్టుకు గౌహతి రెండవ హోం వేదిక… ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా పంజాబ్ కింగ్స్ తమ మూడు హోం మ్యాచ్‌లను ధర్మశాలలో ఆడనుంది. అయితే, ఐపీఎల్ వర్గాల నుండి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ త్వరలో షెడ్యూల్‌ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.