జీవితం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవరికీ తెలియదు. ఒక్కసారిగా జరిగే ప్రమాదం మన కుటుంబం జీవితాన్నే తలకిందలు చేసేస్తుంది. ఆస్పత్రి ఖర్చులు, ఆదాయ నష్టం, ఇంటి బాధ్యతలు అన్నీ ఒక్కపోటిగా వచ్చేస్తాయి. ఇలాంటి వేళా మనల్ని ఆర్థికంగా ఆదుకునే భరోసా అవసరం. ఇప్పుడు అచ్చం అలాంటి భద్రతను భారత ప్రభుత్వ తపాలా శాఖ అందిస్తోంది.
ఇండియన్ పోస్టల్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా కొత్తగా అందుబాటులోకి వచ్చిన ఈ బీమా స్కీమ్, చాలా తక్కువ ఖర్చుతో భారీ రక్షణను అందిస్తోంది. కేవలం సంవత్సరానికి కొన్ని వందల రూపాయల ప్రీమియంతోనే మీరు రూ.10 లక్షల ప్రమాద బీమా పొందొచ్చు. ఇది ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉండే స్కీమ్ కావడం వల్ల సంపూర్ణ భద్రతతో ఉంటుంది.
ఈ బీమా పథకం 18 నుంచి 65 ఏళ్ల మధ్య వయస్సున్న భారతీయులందరికీ అందుబాటులో ఉంటుంది. ముఖ్యంగా డ్రైవర్లు, కూలీలు, రైతులు, ఔట్డోర్ వర్క్ చేసే వారు, చిన్న బిజినెస్ వాల్లు వంటివారికి ఇది అద్భుత రక్షణ. వీరంతా ప్రమాదాలకు ప్రతిరోజూ ఎదురవుతున్న వారే కాబట్టి, ముందు జాగ్రత్తగా ఈ స్కీమ్ను తీసుకుంటే జీవితంలో ఎప్పటికైనా ఉపయోగపడుతుంది.
Related Posts
ఈ బీమా కింద ప్రమాద మరణం జరిగితే లేదా శాశ్వత వైకల్యం ఏర్పడితే, మీ కుటుంబానికి రూ.10 లక్షల మొత్తాన్ని అందిస్తారు. అంతేకాక, ఆస్పత్రిలో చికిత్స ఖర్చులకూ, రోజువారీ ఆసుపత్రి భత్యానికి కూడా బీమా సపోర్ట్ ఉంటుంది. పిల్లల విద్యకు సాయం, ఫ్యామిలీ ఖర్చులకి అదనపు సహాయం, అంత్యక్రియల ఖర్చులూ ఈ బీమా కింద లభిస్తాయి.
ఈ పథకాన్ని తీసుకోవాలంటే దగ్గరలోని పోస్టాఫీస్కి వెళ్లి IPPB ఖాతా ఓపెన్ చేయాలి. ఆధార్, మొబైల్ నంబర్, చిరునామా ప్రూఫ్లు తీసుకెళ్లాలి. అప్లికేషన్ ఫారం నింపి ప్రీమియం చెల్లించాలి. ఇదంతా చాలా సింపుల్ ప్రక్రియ.
ఇంతటి ప్రయోజనాలను అందించే ఈ బీమా పథకం గ్రామీణ ప్రాంతాల ప్రజలకూ సులభంగా అందుబాటులో ఉంది. పోస్ట్ ఆఫీస్ దేశంలోని ప్రతి మూలకూ చేరిన సంస్థ కాబట్టి, మీరు ఎక్కడ ఉన్నా ఈ భద్రత పొందొచ్చు. చదువుతున్నవారైనా, ఉద్యోగస్తులైనా, వ్యవసాయ పనులు చేసేవారైనా – ఒక్కసారి ఈ పథకం మీద ఆలోచించండి.
చిన్న ప్రీమియంతో పెద్ద భరోసా కావాలంటే ఆలస్యం చేయకండి. ఈరోజే మీ దగ్గర ఉన్న పోస్టాఫీస్కి వెళ్లి ఈ బీమా స్కీమ్ తీసుకోండి. రేపు ఏమౌతుందో తెలియని రోజుల్లో, ముందు జాగ్రత్తే మన పెద్ద స్నేహితుడు! ₹10 లక్షల రక్షణ మిస్ అవ్వకండి!