రిటైర్మెంట్ తర్వాత నెల నెలకూ స్థిరమైన ఆదాయం వస్తుందంటే ఎంతో సంతోషంగా ఉంటుంది కదా? ముఖ్యంగా వృద్ధాప్యంలో ఖర్చులు పెరుగుతుంటే, రాబడి స్పష్టంగా ఉండాలి. అందుకే పోస్ట్ ఆఫీసు అందిస్తున్న Senior Citizen Savings Scheme (SCSS) ఇప్పుడు పెద్ద హిట్టుగా మారింది. ఎందుకంటే ఈ స్కీమ్లో మీరు పెట్టుబడి పెడితే నెలకు ₹20,500 వరకూ వడ్డీగా పొందవచ్చు. పైగా, ఈ స్కీమ్ పెట్టుబడిదారుల డబ్బు పూర్తిగా సురక్షితంగా ఉంటుంది, మంచి వడ్డీ లభిస్తుంది, ట్యాక్స్ మినహాయింపు సౌలభ్యమూ వుంది.
ఇందులో మీరు కనీసం ₹1000 నుంచి ప్రారంభించవచ్చు. గరిష్ఠంగా అయితే ₹30 లక్షలు పెట్టుబడి పెట్టొచ్చు. ప్రస్తుతం ఈ స్కీమ్పై 8.2 శాతం వడ్డీ లభిస్తుంది. అంటే మీరు ₹30 లక్షలు వేసి ఐదేళ్లు ఉండగలిగితే మొత్తం ₹12,30,000 వడ్డీ వస్తుంది. ఇది మూడు నెలలకోసారి ₹61,500 చొప్పున వస్తుంది. ఈ మొత్తాన్ని నెలకు విభజిస్తే సరిగ్గా ₹20,500 లాభం వస్తుంది. అంటే పింఛన్తో పాటు ఈ చట్నీగా ఈ డబ్బు కూడా మీ ఖర్చులకు దోహదపడుతుంది.
ఒకవేళ మీరు ₹15 లక్షలు మాత్రమే వేస్తే? అప్పుడు ఐదేళ్లలో మొత్తం ₹6,15,000 వడ్డీ వస్తుంది. క్వార్టర్కు ₹30,750 చొప్పున, నెలకు సగటున ₹10,250 వచ్చేలా లెక్క ఉంటుంది. అంటే సగం పెట్టుబడితో సగం వడ్డీ లభిస్తుంది.
Related News
ఈ స్కీమ్లో పెట్టుబడి పెడితే మీరు ట్యాక్స్లో మినహాయింపూ పొందగలుగుతారు. Income Tax 80C సెక్షన్ కింద ట్యాక్స్ మినహాయింపు లభిస్తుంది. ఇది కూడా ఈ స్కీమ్కి బాగా ఆకర్షణీయంగా మారే మరో కారణం.
ఈ స్కీమ్లో 60 ఏళ్లు నిండిన ఎవరైనా పాల్గొనవచ్చు. ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్ అయ్యే డిఫెన్స్ సిబ్బందికి కొన్ని ప్రత్యేక నిబంధనలతో వయస్సు సడలింపూ ఉంటుంది. సాధారణంగా ఈ ఖాతా 5 ఏళ్ల తర్వాత మెచ్యూర్ అవుతుంది. కానీ మీరు ఈ పథకం లాభాలను మరో 3 ఏళ్ల పాటు పొడిగించుకోవచ్చు. అంటే మొత్తం 8 ఏళ్లు వడ్డీతో పాటు రాబడి కూడా పొందవచ్చు.
ఇప్పటికే లక్షల మంది వృద్ధులు ఈ స్కీమ్ని ఎంచుకుని నెలకు మిగులుతున్న డబ్బుతో ప్రశాంతంగా జీవనం గడుపుతున్నారు. మీరు కూడా ఈ సౌకర్యాన్ని వదులుకోకండి. పింఛన్ మిగతా ఆదాయంతో కలిస్తే నెలకు ₹20,500 అంటే చాలా ఉపయోగపడే సాయం అవుతుంది. వృద్ధాప్యంలో లైఫ్ సెక్యూరిటీ కోసం ఇదొక బంగారు అవకాశమే!