TG TET: టెట్‌కు భారీగా తగ్గిన దరఖాస్తులు.. రాత పరీక్షలు అప్పుడే!?

తెలంగాణ ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TET 2025) దరఖాస్తు గడువు ఏప్రిల్ 30 అర్ధరాత్రి 12 గంటలకు ముగిసిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,83,653 దరఖాస్తులు వచ్చాయని విద్యాశాఖ వెల్లడించింది. ఈసారి దరఖాస్తులు 1.50 లక్షలకు మించకపోవచ్చని విద్యాశాఖ వర్గాలు అంచనా వేసినప్పటికీ.. చివరి రోజున భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయని విద్యాశాఖ వెల్లడించింది. ముఖ్యంగా గత 30 గంటల్లో 50 వేల వరకు దరఖాస్తులు వచ్చాయి. గత రెండు గంటల్లోనే 18,492 మంది దరఖాస్తు చేసుకున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

మొత్తం దరఖాస్తుల్లో పేపర్ 1కి 63,261 మంది, పేపర్ 2కి 1,20,392 మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో రెండు పేపర్లకు 15 వేల మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన TETకి 2,75,775 మంది దరఖాస్తు చేసుకోగా.. ఈసారి 92,122 దరఖాస్తులు తగ్గాయి. ఇప్పటికే SGT లుగా పనిచేస్తున్న వారిలో చాలా మంది స్కూల్ అసిస్టెంట్ పోస్టు కోసం మళ్ళీ TET కి దరఖాస్తు చేసుకోవడం గమనార్హం. ఇదిలా ఉండగా, TET ఆన్‌లైన్ పరీక్షలు జూన్ 15 నుండి 30 వరకు జరుగుతాయి.

తెలంగాణ EAPSET ప్రిలిమినరీ కీ మే 4న విడుదల.. మే 6 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు
తెలంగాణలో వ్యవసాయం మరియు ఫార్మసీ స్ట్రీమ్ పరీక్షలకు సంబంధించిన ప్రిలిమినరీ కీని మే 4న విడుదల చేస్తామని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తెలిపింది. పరీక్ష రాసిన అభ్యర్థులు మే 4 నుండి 6 వరకు ప్రతిస్పందన పత్రం మరియు మాస్టర్ ప్రశ్నపత్రంతో పాటు ప్రిలిమినరీ కీని డౌన్‌లోడ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ప్రిలిమినరీ కీపై అభ్యంతరాలను మే 6న ఉదయం 12 గంటలలోపు సమర్పించాలని వెల్లడించారు. మే 29 మరియు 30 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా EAPSET అగ్రికల్చర్ మరియు ఫార్మసీ స్ట్రీమ్ పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. ఇంజనీరింగ్ పరీక్షలు మే 2 నుండి 4 వరకు జరుగుతాయి.

Related News