రాష్ట్రంలో Helmet నిబంధనలను పటిష్టంగా అమలు చేయాలని ఏపీ ప్రభుత్వం, పోలీసులను హైకోర్టు ఆదేశించింది. ఈ విషయంలో చట్టంలోని నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేశారు.
ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరాజ్ సింగ్ ఠాకూర్, జస్టిస్ నైనాలా జయసూర్యలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. Helmet ధరించకపోవడాన్ని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా హైకోర్టు అభిప్రాయపడింది. ఈ విషయంలో ఎవరినీ ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు.
Helmetధరించకపోవడం వల్ల జరిగే మరణాలను దృష్టిలో ఉంచుకుని ద్విచక్ర వాహన చోదకులు తప్పనిసరిగా Helmet ధరించాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ సందర్భంగా కేంద్ర మోటారు వాహన సవరణ చట్టంలోని నిబంధనల అమలుకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో వివరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఆమె తెలిపారు. తదుపరి విచారణను ఆగస్టు 21కి వాయిదా వేసింది.
Related News
ద్విచక్ర వాహనదారులు Helmet ధరించాల్సిన ఆవశ్యకత, అవి ధరించకపోతే కలిగే దుష్పరిణామాలపై అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని పోలీసులను, న్యాయసేవా అధికార యంత్రాంగాన్ని ధర్మాసనం ఆదేశించింది. చట్టంలోని నిబంధనల గురించి ప్రాంతీయ, జాతీయ భాషా పత్రికల్లో ప్రకటనలు ఇవ్వాలని పేర్కొంది. రోడ్లపై విధులు నిర్వహించే పోలీసులు తప్పనిసరిగా బాడీవోర్న్ కెమెరాలు ధరించాలని సూచించారు. ఈ దిశగా చర్యలు తీసుకోవాలని ఆమె అన్నారు. తద్వారా చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై సాక్ష్యాధారాలను కోర్టు ముందు ప్రవేశపెట్టి శిక్షించవచ్చు. ఈ కేసు విస్తృత ప్రజా ప్రయోజనాలకు సంబంధించినదని, దీనిని తీవ్రంగా పరిగణించాలని ప్రభుత్వానికి, పోలీసులకు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఉల్లంఘించిన వారికి జారీ చేసిన చలాన్ల వివరాలు, వాహన తనిఖీల వివరాలను తమ ముందు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది.