GOOD NEWS: ప్రయాణికులకు గుడ్ న్యూస్.. శివరాత్రికి స్పెషల్ బస్సులు

శివరాత్రి సందర్భంగా ప్రయాణికులకు APSRTC శుభవార్త చెప్పింది. మహా శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలకు ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు APSRTC ఇటీవల ప్రకటించింది. ప్రయాణికులు ఎటువంటి ఇబ్బందులను ఎదుర్కోకుండా ఉండటానికి శైవ క్షేత్రాలలో అన్ని సౌకర్యాలతో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

మహా శివరాత్రికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారని APSRTC అంచనా వేసింది. దీనితో రాష్ట్రంలోని 99 ప్రముఖ శైవ క్షేత్రాలకు భక్తులు ప్రయాణించడానికి, తిరిగి రావడానికి RTC 3,500 ప్రత్యేక బస్సులను కేటాయించింది. అయితే, YSR జిల్లాలోని 12 క్షేత్రాలు, నెల్లూరు జిల్లాలోని 9 క్షేత్రాలు, తిరుపతి జిల్లాలోని 9 క్షేత్రాలు, నంద్యాల జిల్లాలోని 7 క్షేత్రాలకు గరిష్ట సంఖ్యలో బస్సులను ఏర్పాటు చేశారు.