Good news for AP DSC candidates: సిలబస్‌లో మార్పు లేదు.. ఫీజు మినహాయింపు

రాష్ట్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న Mega DSC ని ఎలాంటి విమర్శలు లేకుండా పారదర్శకంగా నిర్వహించాలనిState Education, IT and Electronics Minister Nara Lokesh  అధికారులను ఆదేశించారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

మంగళవారం పాఠశాల విద్యాశాఖ ఉన్నతాధికారులతో టెట్, Mega DSC  నిర్వహణపై మంత్రి లోకేశ్ సమీక్ష నిర్వహించారు. టెట్ నోటిఫికేషన్, Mega DSC  విడుదల సందర్భంగా పలు అంశాలపై అధికారులతో చర్చించారు. టెట్ మరియు మెగా డీఎస్సీ మధ్య ఎక్కువ సమయం కావాలని అభ్యర్థుల నుండి అభ్యర్థనలు ఉన్నాయి DSC  ఎప్పుడు నిర్వహించాలనే అంశంపై అభ్యర్థులు, విద్యార్థులు, యువజన సంఘాల నుంచి అభిప్రాయాలు సేకరించాలని రాష్ట్ర విద్యా, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ సూచించారు.

Syllabusలో ఎలాంటి మార్పు లేదు

Related News

syllabus విషయంలో సోషల్ మీడియాలో వస్తున్న తప్పుడు ప్రచారంపై మంత్రి నారా లోకేష్ ఆరా తీశారు. సిలబస్‌లో ఎలాంటి మార్పులు చేయలేదని వివరించారు. 2024 ఫిబ్రవరిలో టెట్ నిర్వహించిన సిలబస్‌లోనే 2024 July లో పరీక్షను నిర్వహించబోతున్నట్లు అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. సిలబస్ వివరాలను https://aptet.apcfss.in లో అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు. aptet.apcfss.in, vలో ఎలాంటి మార్పులు చేయలేదని, పాత సిలబస్‌తోనే టెట్‌ నిర్వహిస్తారని సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు. మెగా డీఎస్సీలో కొన్ని జిల్లాలకు వివిధ శాఖల్లో తక్కువ పోస్టులు వచ్చాయని పలువురు అభ్యర్థులు తనను కలిసిన విషయాన్ని ప్రస్తావించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ప్రకాశం జిల్లాలో ఉపాధ్యాయుల పదోన్నతులపై కొందరు కోర్టును ఆశ్రయించారని… దాని వల్లే పోస్టులు తగ్గాయని అధికారులు వివరించారు. అనంతపురం, శ్రీకాకుళం, నెల్లూరు జిల్లాల్లోని పోస్టులకు సంబంధించిన న్యాయపరమైన వివాదాలను పరిష్కరించి పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని లోకేష్ అధికారులను ఆదేశించారు. పాఠశాలల మూసివేతకు సంబంధించి గత ప్రభుత్వం తీసుకొచ్చిన జి.ఓ. 117 నష్టం జరిగితే సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. Mega DSC లో వయోపరిమితి సడలింపు సమస్యలను అధికారులు మంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఎన్నికలకు ముందు గత ప్రభుత్వం విడుదల చేసిన DSC నోటిఫికేషన్‌లో దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈ డీఎస్సీలో ఫీజు మినహాయింపు ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించారు.

ఏపీ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో ఔట్ సోర్సింగ్ కింద పనిచేస్తున్న 1,633 మంది టీచింగ్ సిబ్బంది డిమాండ్లను అధ్యయనం చేసి వారికి నష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని లోకేశ్ అధికారులను కోరారు.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *