
ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ స్కీమ్ యువత కోసం రూపొందించబడిన అద్భుతమైన అవకాశంగా మారింది. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ 2024-25లో ఈ స్కీమ్ను ప్రారంభించింది. ఈ స్కీమ్ ద్వారా 21 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సున్న యువతకు ప్రభుత్వ సహకారంతో ఉద్యోగ అవకాశాలు, శిక్షణ మరియు నెలకు రూ.5000 స్టైపెండ్ అందుతుంది. ఈ స్టైపెండ్ను అభ్యర్థులు ప్రయాణ ఖర్చులు మరియు ఇతర అవసరాలకు ఉపయోగించుకోవచ్చు.
ఇప్పటికే 500కిపైగా ప్రముఖ కంపెనీలు ఈ ప్రోగ్రాంలో భాగస్వామ్యం అయ్యాయి. యువతకు ఉపాధి కల్పించడమే కాకుండా, కంపెనీలకు సరైన అభ్యర్థులను ఎంపిక చేసుకునే అవకాశం కూడా ఈ స్కీమ్ ద్వారా కలుగుతుంది. దీనివల్ల యువతకు ఉద్యోగ అనుభవం, నైపుణ్య అభివృద్ధి రెండూ ఒకేసారి లభిస్తున్నాయి.
చివరి అవకాశం
ఈ స్కీమ్కు దరఖాస్తు చేసుకోవడానికి తుది తేదీని ప్రభుత్వం ఇప్పటికే రెండు సార్లు పొడిగించింది. మొదట మార్చి 12, 2025గా నిర్ణయించిన చివరి తేదీని మార్చి 31కు, ఇప్పుడు మళ్లీ ఏప్రిల్ 15, 2025 వరకు పొడిగించారు. ఇది యువతకు చివరి అవకాశం కావచ్చు.
[news_related_post]దరఖాస్తు ప్రక్రియ చాలా సరళంగా ఉంటుంది. అధికారిక వెబ్సైట్కి వెళ్లి రిజిస్ట్రేషన్ లింక్పై క్లిక్ చేసి, లాగిన్ చేసి, మీ వివరాలు మరియు అవసరమైన డాక్యుమెంట్లు అప్లోడ్ చేసి ఫారమ్ను సమర్పించవచ్చు.
ఈ స్కీమ్కి అర్హత కలిగి ఉండాలంటే 10వ తరగతి, 12వ తరగతి, డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. వయస్సు తప్పనిసరిగా 21 నుంచి 24 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
ఒక్కసారి దరఖాస్తు పెట్టి రూ.10 పెట్టుబడి పెడితే నెలకు రూ.5000 లభించేది. ఇది చవకైన పెట్టుబడికి గరిష్ఠ లాభం అన్నట్టు. మిస్సైతే మళ్లీ రావచ్చో రాకపోవచ్చో తెలియదు. అందుకే వెంటనే అప్లై చేయండి – ఇది మీ కెరీర్కు గొప్ప ఆరంభం కావచ్చు.