1200 ఎకరాల్లో EV పరిశ్రమ.. భారీ ఒప్పందం

టాలీవుడ్‌లో వరుసగా పెద్ద చిత్రాలను నిర్మిస్తూ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పునరాగమనం చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ కంపెనీ పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్‌తో `రాజా సాబ్`, బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్‌తో `జాత్` వంటి పెద్ద చిత్రాలను నిర్మిస్తోంది, ఇతర హీరోలతో కూడా సినిమాలు నిర్మిస్తోంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఇవన్నీ ప్రస్తుతం సెట్స్‌లో ఉన్నాయి.

ఇటీవల పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వ ప్రసాద్, పీపుల్ టెక్ ఎంటర్‌ప్రైజెస్ ప్రతినిధులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌ను కలిశారు. ఓర్వకల్ (కర్నూలు) సమీపంలో 1200 ఎకరాల్లో ఎలక్ట్రిక్ వెహికల్ పార్క్ ఏర్పాటు చేయడానికి పీపుల్ టెక్ ఎంటర్‌ప్రైజెస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. దీనికి సంబంధించిన వివరాలను పీపుల్ టెక్ గ్రూప్ సీఈఓ విశ్వ ప్రసాద్ అందించారు.

Related News

విశ్వ ప్రసాద్ మాట్లాడుతూ, “వాహనాల తయారీ, పరిశోధన, అభివృద్ధి కేంద్రాలు, పరీక్షా ట్రాక్‌లు, ప్లగ్ అండ్ ప్లే ఇండస్ట్రియల్ ఏరియా పారిశ్రామిక పార్క్‌లో ఉంటుంది. ఇది దేశంలోనే మొట్టమొదటి ప్రైవేట్ ఈవీ పార్క్. దీని ద్వారా 25,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని, దీని ద్వారా రూ. 13,000 కోట్ల పెట్టుబడి ఉంటుందని ఆయన వివరించారు.

పవన్ కళ్యాణ్ స్పందిస్తూ – “కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లు సమీపంలో ఎలక్ట్రిక్ వెహికల్ పార్క్ ఏర్పాటు స్వాగతించదగిన పరిణామం. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి ఇది ఒక మైలురాయి.“ కాలుష్యాన్ని గణనీయంగా తగ్గించడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దృష్టి సారించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం కూడా ఎలక్ట్రిక్ వాహనాలను విస్తృతంగా అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. కాలుష్యాన్ని తగ్గించడానికి EV పరిశ్రమ అవసరమని ఆయన వ్యాఖ్యానించారు. శ్రీ భాస్కర రెడ్డి, శ్రీ రవికిరణ్ అకెల్లా, శ్రీ బాబ్ డఫీ, శ్రీ స్టీవ్ గెర్బర్, శ్రీ హెరాల్డ్ రాక్రిజెల్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ గతంలో పవన్ కళ్యాణ్, సాయి తేజ్ ప్రధాన పాత్రల్లో నటించిన “బ్రో” చిత్రాన్ని నిర్మించిన విషయం తెలిసిందే. పీపుల్ టెక్ & పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత విశ్వ ప్రసాద్ తెలుగుదేశం నాయకుడు మరియు మాజీ ఎంపీ టీజీ వెంకటేష్ బంధువు. టీజీ కుటుంబానికి దశాబ్దాలుగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో మంచి సంబంధాలు ఉన్నాయి.