DSC: వచ్చే నెల మొదటి వారంలోనే డీఎస్సీ నోటిఫికేషన్..

ఏప్రిల్ మొదటి వారంలో ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. పాఠశాలలు ప్రారంభం నాటికి పోస్టింగ్‌లు ఇవ్వాలని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో రెండు రోజుల పాటు జరిగే 3వ జిల్లా కలెక్టర్ల సమావేశం ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ప్రధాన కార్యదర్శులు, వివిధ శాఖల కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ.. సమస్యలను పరిష్కరించడంలో కలెక్టర్లు కీలక పాత్ర పోషిస్తారని అన్నారు. నాశనమైన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలని సూచించారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రజా సమస్యలను పరిష్కరించడం అందరి లక్ష్యం కావాలని ఆయన అన్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో కలెక్టర్లకు కీలక పాత్ర ఉందని ఆయన అన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలన తమ ప్రభుత్వ లక్ష్యాలని ఆయన అన్నారు. ప్రజలు సంతోషంగా ఉండాలంటే సంక్షేమ కార్యక్రమాలు అవసరమని ఆయన అన్నారు. సంక్షేమ కార్యక్రమాలకు ఆదాయం అవసరమని అన్నారు. ప్రభుత్వం, పరిపాలన ఎంతకాలం అప్పులు చేస్తూనే ఉంటాయని ప్రశ్నించారు. ఏ రాష్ట్రంలోనూ 4000 పెన్షన్ ఇవ్వడం లేదని అన్నారు. సంక్షేమ పథకాలను క్షేత్ర స్థాయిలో పేదలకు సక్రమంగా అందించడం కలెక్టర్ల బాధ్యత అని అన్నారు. కలెక్టర్ల సమావేశంలో ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ మాట్లాడుతూ.. స్వర్ణ ఆంధ్ర 2047లో భాగంగా నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇస్తామని చెప్పారు. వివిధ ఉత్తమ పద్ధతులను అవలంబించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించడానికి కృషి చేయాలని కలెక్టర్లకు సీఎస్ స్పష్టం చేశారు.