ట్రంప్ టారిఫ్ దెబ్బతో బిట్‌కాయిన్ ₹6 లక్షలు పతనం… క్రిప్టోలో పెట్టుబడి లాభమా?..

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల కొత్త టారిఫ్‌లు ప్రకటించారు. ఈ ప్రకటన వల్ల కేవలం ప్రపంచ వ్యాపార మార్కెట్లకే కాదు, క్రిప్టో కరెన్సీ మార్కెట్‌కూ భారీ దెబ్బ తగిలింది. ముఖ్యంగా బిట్‌కాయిన్‌ ధర ఒక్క రాత్రిలోనే ₹6 లక్షలకుపైగా పడిపోయింది. ట్రంప్ ప్రసంగంలో క్రిప్టో గురించి ఒక్క మాట కూడా చెప్పకపోవడంతో పెట్టుబడిదారుల్లో గందరగోళం మొదలైంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

బుధవారం రాత్రి ట్రంప్ ప్రకటించిన ఈ టారిఫ్ ప్రకారం, అమెరికా ఎగుమతులపై కనీసం 10% టారిఫ్ అమలు చేస్తామని చెప్పారు. ఇందులో భారత్‌పై 26%, చైనా‌పై 34%, జపాన్‌పై 24%, యూరోప్ యూనియన్‌పై 20% టారిఫ్‌లు ఉంటాయని స్పష్టం చేశారు. మొత్తం 60 దేశాలపై అదనపు టారిఫ్‌లు అమలు చేయనున్నట్లు చెప్పారు.

ఈ ప్రకటన తరువాత, క్రిప్టో మార్కెట్ వెంటనే నెగిటివ్‌గా స్పందించింది. బిట్‌కాయిన్ గురువారం ఉదయం వరకు 4% తగ్గి సింగపూర్ మార్కెట్‌లో ₹82,00,000 వద్దకు వచ్చేసింది. ఇది ముందుగా ఉన్న ₹88 లక్షల ధరతో పోలిస్తే భారీ తగ్గుదల. ఇథర్, XRP లాంటివి కూడా డౌన్ అయ్యాయి. ట్రంప్ తాజా మాటల్లో క్రిప్టోకు సంబంధించి ఎలాంటి స్పష్టత లేకపోవడం వల్ల పెట్టుబడిదారులు భయంతో బంగారం లేదా డాలర్‌లాంటి సేఫ్ అసెట్‌లవైపు వెళ్లిపోతున్నారు.

Related News

Ava Labs అధ్యక్షుడు జాన్ వూ ఈ పరిస్థితిపై స్పందిస్తూ – మార్కెట్లో అస్థిరత వచ్చినప్పుడు, ముఖ్యంగా వడ్డీ రేట్లు పెరిగినప్పుడు లేదా ఇలా ట్రేడ్ టారిఫ్‌లు వచ్చినప్పుడు క్రిప్టో మార్కెట్ క్షీణిస్తుంది అన్నారు. DYOR CEO బెన్ కర్లండ్ మాట్లాడుతూ – ట్రేడర్లు అస్థిరతను అస్సలు ఇష్టపడరని, క్రిప్టో మార్కెట్ పతనానికి అవకాశం ఎక్కువే అని హెచ్చరిస్తున్నారు.

మీరు క్రిప్టోలో పెట్టుబడి పెట్టాలని అనుకుంటే, ఇప్పటి పరిస్థితి చాలా డేంజర్. ట్రంప్ విధానాలు ఎలా మారుతాయో స్పష్టంగా తెలియకపోవడంతో మార్కెట్ ఏ దిశలో పోతుందో అర్థం కావడం లేదు. ముందు జాగ్రత్తగా ఉండాలి, లేదంటే లక్షల్లో నష్టాలు ఎదురవుతాయి.