Weather: తెలుగురాష్ట్రాల్లో భిన్న వాతావరణం.ఓవైపు ఎండలు.. మరోవైపు వర్షాలు..

తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఒక్కసారిగా వాతావరణం మారుతోంది. ఒకవైపు మండే వేడి, తేమతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మరోవైపు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులు బీభత్సం సృష్టిస్తున్నాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now

శుక్రవారం ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా ఆదిలాబాద్ జిల్లాలో అత్యధికంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్ లో అత్యల్ప ఉష్ణోగ్రత 36.2 డిగ్రీలగా నమోదైంది. శనివారం కూడా తెలంగాణలోని పలు జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది. నేడు ఆదిలాబాద్ జిల్లాలో గరిష్ట ఉష్ణోగ్రత 40.3 డిగ్రీలు. భద్రాచలంలో కనిష్ట ఉష్ణోగ్రత 36.6 డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉంది.

మరోవైపు, రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ వాతావరణ శాఖ రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.

Related News

తెలంగాణతో పాటు ఏపీలోనూ ఇలాంటి వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రంలో వేడి తీవ్రత క్రమంగా పెరుగుతుందని విపత్తు నిర్వహణ సంస్థ వెల్లడించింది. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. శనివారం గరిష్ట ఉష్ణోగ్రత 42 నుంచి 43.5 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశం ఉంది.

రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉందని తెలుస్తోంది. మన్యం జిల్లాలోని పాలకొండ, తూర్పుగోదావరి జిల్లా గోకవరం, కాకినాడ జిల్లాలోని ఏలేశ్వరం మండలాల్లో తీవ్రమైన వేడిగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆదివారం 7 మండలాల్లో తీవ్రమైన వేడిగాలులతో పాటు 46 మండలాల్లో వేడిగాలులు వీచే అవకాశం ఉంది.

ఒకవైపు రాష్ట్రవ్యాప్తంగా గరిష్ట ఉష్ణోగ్రతలు, వడగాలులతో ప్రజలు ఇబ్బంది పడుతుండగా, మరోవైపు వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. శనివారం అల్లూరి, సీతారామరాజు, చిత్తూరు, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. మిగిలిన జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.