ముద్రగడ పేరు మార్పు – ప్రభుత్వం గజెట్ జారీ..!!

కాపు ఉద్యమనేత ముద్రగడ తన పేరు మార్చుకున్నారు. ఎన్నికల సమయంలో పిఠాపురం నుంచి పవన్ గెలిస్తే పేరు మార్చుకుంటానని ముద్రగడ సవాల్ విసిరారు. ఆ ఎన్నికల్లో పవన్ విజయం సాధించారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

దీంతో దళారులు ముద్రగడ పేరు మార్పుపై ప్రశ్నించారు. ఆ సమయంలో పేరు మార్పు కోసం దరఖాస్తు చేసుకున్నట్లు వెల్లడించారు. ఇప్పుడు ఏపీ ప్రభుత్వ గెజిట్ ద్వారా ముద్రగడ పద్మనాభ రెడ్డిగా మారిపోయారు.

ముద్రగడ పద్మనాభం ఎన్నికల ముందు వైసీపీలో చేరారు. అంతకు ముందు జనసేనలో చేరే ప్రయత్నం జరిగింది. వపన్‌తో కలిసి పనిచేసేందుకు సిద్ధమని ముద్రగడ తెలిపారు. కానీ, ముద్రగడ ఇంటికి పవన్ వస్తాడని ప్రచారం జరిగినా.. కుదరలేదు. దీంతో జనసేనలో చేరకూడదని నిర్ణయించుకున్న ముద్రగడతో వైసీపీ నేతలు సంప్రదింపులు జరిపారు. దీంతో ఆయన వైసీపీలో చేరారు. పిఠాపురంలో పవన్ కు వ్యతిరేకంగా ప్రచారం చేశారు. పవన్‌ని ఓడిస్తానని శపథం చేశారు.

పిఠాపరంలో తనకు తెలిసిన వారితో గ్రామ గ్రామాన పర్యటించారు. పిఠాపురంతో పవన్‌కి సంబంధం ఏంటి? అంటూ పవన్ పై తీవ్ర విమర్శలు చేశారు.  పవన్ ను ఓడించలేకపోతే తన పేరును పద్మనాభ రెడ్డిగా మార్చుకుంటానని శపథం చేశారు. ఆ ఎన్నికల్లో పవన్ భారీ మెజారిటీతో గెలుపొందారు. దీంతో ముద్రగడ పేరు ఎప్పుడు మారుస్తారని జనసేన శ్రేణులు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. పేరు మార్పును ప్రారంభించడానికి ముద్రగడ అధికారిక ప్రక్రియ కోసం దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా ముద్రగడ పేరును పద్మనాభరెడ్డిగా మారుస్తూ ప్రభుత్వం గెజిట్ విడుదల చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *