ఏపీ ఉద్యోగులకు చంద్రబాబు గుడ్ న్యూస్! మరో ఏడాది పొడిగింపు..!

ఏపీలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఉద్యోగుల విషయంలో సానుకూల నిర్ణయాలు తీసుకుంటోంది. గత వైసీపీ హయాంలో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో.. అన్ని విషయాల్లో వారికి మేలు జరిగేలా ప్రతి నిర్ణయం వెలువడుతోంది. ఇందులో భాగంగా Chief Minister Chandrababu Naidu  ఈరోజు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయం రాష్ట్ర స్థాయి ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

2015లో అమరావతిని రాష్ట్ర రాజధానిగా ఎంపిక చేసిన తర్వాత విభజనలో త్వరితగతిన అభివృద్ధి చేసేందుకు అప్పటి టీడీపీ ప్రభుత్వం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో Hyderabad నుంచి వచ్చి Amaravathiలో పనిచేసే ఉద్యోగులకు ఐదు రోజుల పనిదినాలు కూడా కల్పించారు. అంటే సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే పనిచేసేందుకు వెసులుబాటు కల్పించారు. దీన్ని అప్పటి టీడీపీ ప్రభుత్వంతో పాటు ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం కూడా కొనసాగించింది. నేటితో గడువు ముగిసింది.

ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయి ఉద్యోగులకు వారానికి ఐదు రోజుల పని షెడ్యూల్‌ను పొడిగిస్తూ సీఎం చంద్రబాబు మరోసారి నిర్ణయం తీసుకున్నారు. సచివాలయం, హెచ్‌ఓడీ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఐదు రోజుల పనిదినాలు పొడిగిస్తూ జారీ చేసిన ఉత్తర్వులకు సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. దీంతో వారంలో ఐదు రోజుల పనిదినాల పాలన ముగియనున్న నేపథ్యంలో చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు లేదా రేపు ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ప్రభుత్వ నిర్ణయం పట్ల ఉద్యోగులు సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు.

Related News

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *