Budget 2024: మధ్య తరగతి కోసం కొత్త హౌసింగ్ స్కీమ్ – నిర్మల సీతారాం

గృహనిర్మాణ పథకం | ఢిల్లీ : మధ్యతరగతి ప్రజలకు కేంద్రం శుభవార్త చెప్పింది. అర్హులైన వారికి ఇళ్లు కొనుగోలు, సొంత ఇళ్లు నిర్మించుకునేందుకు గృహ నిర్మాణ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Follow Us

మురికివాడలు, అద్దె ఇళ్లలో నివసించే వారికి సొంత ఇంటి కల సాకారమవుతుందని బడ్జెట్ (యూనియన్ బడ్జెట్ 2024) ప్రసంగంలో ప్రస్తావించారు. అలాగే, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద వచ్చే ఐదేళ్లలో 2 కోట్ల ఇళ్ల నిర్మాణం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

సొంత ఇళ్ల నిర్మాణం కోసం తీసుకొచ్చిన ‘పీఎం ఆవాస్ యోజన గ్రామీణ’ కరోనా కాలంలో కూడా కొనసాగిందని నిర్మలా సీతారామన్ అన్నారు. త్వరలో 3 కోట్ల ఇళ్ల నిర్మాణ లక్ష్యాన్ని చేరుకుంటామన్నారు. పెరుగుతున్న జనాభాను దృష్టిలో ఉంచుకుని వచ్చే ఐదేళ్లపాటు ఈ పథకాన్ని కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. మొత్తం 2 కోట్ల ఇళ్లను నిర్మించనున్నట్లు వివరించారు.

Related News

300 units of free electricity per crore houses

సామాన్యులకు విద్యుత్ బిల్లుల నుంచి విముక్తి కల్పించేందుకు ఆర్థిక మంత్రి బడ్జెట్లో కొత్త పథకాన్ని ప్రకటించారు. దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించేందుకు కొత్త రూఫ్టాప్ సోలారైజేషన్ పథకాన్ని తీసుకువస్తామని చెప్పారు.

దీనివల్ల గృహ వినియోగదారులకు రూ. 15 వేల నుంచి 18 వేల వరకు ఆదా అవుతుందన్నారు. అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ ఈ పథకం గురించి ప్రకటించిన సంగతి తెలిసిందే.

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *